CV Anand: హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో 7 వేల మందికి టోకరా.. రూ.200 కోట్లు ఢమాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad CP CV Anand Reveals Cheating Case Of Herbal Products: స్వప్న లోక్ అగ్నిప్రమాద ఘటన గుర్తుందా? ఈ ప్రమాదం జరిగిన తర్వాత Q మార్ట్ మోసాలు బయటకు వచ్చాయి. ఈ మోసాలపై దర్యాప్తు చేస్తుండగా.. మరో ముఠా పట్టుబడిందని తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ముఠా ఢిల్లీ, ఘజియాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతోందని చెప్పారు. హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో దేశవ్యాప్తంగా 7 వేల మందిని ఈ ముఠా సభ్యులు మోసం చేశారని కుండబద్దలు కొట్టారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ.200 కోట్ల వరకు వీళ్లు దోచుకున్నారని షాకింగ్ వివరాలు బయటపెట్టారు. చట్ట ప్రకారం.. మల్టీ లెవల్ మార్కెటింగ్, పిరమిడ్ స్కీమ్లు నేరమన్నారు. అయితే.. ఈ ముఠా సభ్యులు హెర్బల్ ప్రాడక్ట్స్ పేరుతో, అమాయకుల్ని మోసం చేశారని, వారి నుంచి దారుణంగా భారీ మొత్తం దోచుకున్నారని చెప్పారు.
PM Modi Tour: వరంగల్లో మోడీ పర్యటన.. బహిష్కరించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
పర్ఫెక్ట్ హెర్బల్ స్టోర్ పేరుతో ఉన్న స్కీమ్లో రూ.6 లక్షలు కడితే.. 30 నెలల పాటు నెలకు 30 వేలు ఇస్తామని ఈ ముఠా సభ్యులు ఓ స్కీమ్ పెట్టారని సీవీ ఆనంద్ తెలిపారు. ఐడీ స్కీమ్లో రూ.9999 కడితే.. నెలకు రూ.880 చొప్పున 36 నెలలపాటు ఇస్తామని నమ్మించారన్నారు. పర్ఫెక్ట్ బజార్ పేరుతో ఉన్న మరో స్కీమ్లో 25 లక్షలు కడితే.. నెలకు రూ.1లక్ష చొప్పున 36 నెలలు ఇస్తామని నమ్మబలికారని అన్నారు. ఇవే కాకుండా… హిల్ స్టేషన్ టూర్, ల్యాప్టాప్స్, బైక్స్, జ్యువెలరీ, ఫ్లాట్, కార్లు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటనలు ఇచ్చారన్నారు. వీరిచ్చిన ఈ ప్రకటనల పట్ల ఆకర్షితులై.. జనాలు మోసపోయారన్నారు. ఈ కేసులో తాము రియాజుద్దీన్, బాబి చౌదరీలను అరెస్ట్ చేశామని.. షకీలా, పూజా కుమారి పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి ప్రకటనలు చూసి అమాయకులు మోసపోవద్దని సూచించారు. డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరని.. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
Ponnam Prabhakar: బీజేపీ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునేందుకే మోడీ పర్యటన
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!