బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..
- బిర్యానీ ప్రియులకు షాక్
- పోలీసుల రైడ్లో బయటపడ్డ నిజాలు
- ఫ్రిడ్జ్లో పాత స్టాక్
- హోటల్ సీజ్, కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్లో వెలుగుచూసిన కుళ్లిన బిర్యానీ ఉదంతం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ‘లక్కీ బిర్యానీ షవర్మాస్’ అనే రెస్టారెంట్ బాగోతాన్ని బంజారాహిల్స్ పోలీసులు రట్టు చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలోని వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఒక ఆన్లైన్ ఫుడ్ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్ తెరవగానే అందులో నుంచి విపరీతమైన దుర్వాసన రావడమే కాకుండా, బిర్యానీ పూర్తిగా కుళ్లిపోయి ఉండటాన్ని గమనించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు రెస్టారెంట్పై ఆకస్మిక దాడులు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే తయారు చేసిన బిర్యానీని ప్యాకెట్లుగా మార్చి, ఇక్కడి అవుట్లెట్ లోని ఫ్రిడ్జ్లో భద్రపరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ చేసినప్పుడు, ఆ పాత ప్యాకెట్లను తీసి ఓవెన్లో వేడి చేసి కొత్త బిర్యానీలా కస్టమర్లకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. హోటల్ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, ఆహార పదార్థాలు నిల్వ ఉంచిన ఫ్రిడ్జ్లో ఎలుకలు కూడా తిరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు.
UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ రెస్టారెంట్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, హోటల్ యజమాని ఇర్ఫాన్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన ఆహారాన్ని విక్రయిస్తున్న సదరు హోటల్ను వెంటనే సీజ్ చేశారు. ఈ ఘటన ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!