Hyderabad Air Issue: హైదరాబాద్ లో భారీగా పెరిగిన కాలుష్యం.. గ్రీన్ పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Air Issue: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అనేక అంశాల్లో దేశంలోని ఇతర నగరాల కంటే భాగ్యనగరం ముందుంది. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్కు వలస వస్తుంటారు. అయితే నంబర్ వన్ సిటీగా నిలవాలనుకుంటున్న మన నగరం మాత్రం పెను ప్రమాదంలో పడింది. హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నగరంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత కాలుష్య నగరం. గ్రీన్ పీస్ ఇండియా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్పీస్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బెంగళూరు, కొచ్చి, చెన్నైలతో పోల్చితే హైదరాబాద్లో 2.5 PM కాలుష్య కారకాలు ఉన్నట్లు తేలింది.
Read also: Fighter VS Operation Valentine: 300 కోట్లు vs 40 కోట్లు.. ఆపరేషన్ వాలెంటైన్ ఇన్ యాక్షన్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన ప్రమాణాల కంటే మన నగరంలో కాలుష్యం 14 రెట్లు ఎక్కువగా విడుదలవుతోంది. ప్రపంచ వాయు నాణ్యత సూచీలో కాలుష్య నగరాల జాబితాలో భాగ్యనగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలో బంజారాహిల్స్, కేపీహెచ్బీలు ముందున్నాయి. బంజారాహిల్స్లో 127, కేపీహెచ్బీలో 124, జూపార్క్లో 144, సైదాబాద్లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకుంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లోనూ వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కోల్కతా, హైదరాబాద్ ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై కంటే భాగ్యనగరంలో వాయుకాలుష్యం ఎక్కువగా ఉండడం గమనార్హం. మన నగరంలో ప్రతిరోజూ 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండడంతో కాలుష్యం పెరుగుతోంది.
Hyderabad: బ్రాండెడ్ ముసుగులో సాసిరకం సరుకు.. కాటేదాన్లో తయారీ, నాగారంలో నిల్వ
తాజావార్తలు
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..