Telangana: ప్రభుత్వ కళాశాలకు రంగులు వేసిన ప్రిన్సిపాల్.. నెటిజన్ల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంటే అందరికీ చులకన భావనే ఉంటుంది. సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలేజీకి రంగులు వేయించడానికి నిధులు లేకపోవడంతో స్వయంగా ఆయనే పెయింట్ బ్రష్ చేతపట్టుకుని రంగులు వేస్తున్నారు. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గురువారం ఉదయం స్థానికులు హుజూర్ నగర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల గ్రౌండ్కు వాకింగ్కు వెళ్లగా అక్కడ ఆశ్చర్యపోయే సీన్ వాళ్లకు కనిపించింది. ఉదయాన్నే ముగ్గురు వ్యక్తులు డిగ్రీ కాలేజీకి మెయిన్ గేటుకు రంగులు వేస్తూ వాకర్స్కు కనిపించారు. అయితే పెయింట్ వేసే వాళ్లలో కాలేజీ ప్రిన్సిపాల్ బీమార్జున్రెడ్డి కూడా ఉన్నారని వాళ్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో వాకర్స్ ఆప్యాయంగా ప్రిన్సిపాల్ను పలకరించారు. ఆయనలో ప్రిన్సిపాల్ అనే దర్పం లేదని.. అంతటి హోదాలోనూ సాదాసీదాగా పనిచేస్తుండటం నమ్మశక్యంగా అనిపించలేదని వాకర్స్ అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు గ్రంథాలయ అధికారి నాగరాజు, మరొక విద్యార్థి రాత్రంతా కళాశాలలోనే ఉండి పొద్దున్నే కాలేజీకి స్వయంగా రంగులు వేస్తున్నారని వారు వెల్లడించారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్

ఈ మేరకు వాకర్స్ ప్రిన్సిపల్ పెయింట్ వేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీ నీటుగా ఉండేందుకు ప్రిన్సిపాల్ బీమార్జున్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని.. నిధులు లేకపోయినా అంకితభావం, పట్టుదలగా పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చారని.. కాలేజీని గ్రీనరీ మయం చేశారని కొనియాడుతున్నారు. కొందరు ఉద్యోగులు సమయానికి కళాశాలకు రావటమే గగనంగా మారిన ఈ రోజుల్లో రాత్రులు కళాశాలలోనే ఉండి కాలేజీ గురించి ఆలోచించడం అభినందనీయమని అంటున్నారు. మొత్తం కాలేజీలో 14 మంది అధ్యాపకులు, 350 మంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపాల్ చెప్పినట్లు వాకర్స్ తెలిపారు. ప్రతి పనికి లంచం తీసుకునే ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ, నిబద్ధత గల ప్రిన్సిపాల్ హుజూర్ నగర్ డిగ్రీ కళాశాలకు దొరకడం నిజంగా ఓ వరమని పేర్కొన్నారు.
Srisailam Project: నిపుణుల కమిటీ హెచ్చరిక.. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!