Telangana: ప్రభుత్వ కళాశాలకు రంగులు వేసిన ప్రిన్సిపాల్.. నెటిజన్ల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంటే అందరికీ చులకన భావనే ఉంటుంది. సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలేజీకి రంగులు వేయించడానికి నిధులు లేకపోవడంతో స్వయంగా ఆయనే పెయింట్ బ్రష్ చేతపట్టుకుని రంగులు వేస్తున్నారు. దీంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గురువారం ఉదయం స్థానికులు హుజూర్ నగర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల గ్రౌండ్కు వాకింగ్కు వెళ్లగా అక్కడ ఆశ్చర్యపోయే సీన్ వాళ్లకు కనిపించింది. ఉదయాన్నే ముగ్గురు వ్యక్తులు డిగ్రీ కాలేజీకి మెయిన్ గేటుకు రంగులు వేస్తూ వాకర్స్కు కనిపించారు. అయితే పెయింట్ వేసే వాళ్లలో కాలేజీ ప్రిన్సిపాల్ బీమార్జున్రెడ్డి కూడా ఉన్నారని వాళ్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దీంతో వాకర్స్ ఆప్యాయంగా ప్రిన్సిపాల్ను పలకరించారు. ఆయనలో ప్రిన్సిపాల్ అనే దర్పం లేదని.. అంతటి హోదాలోనూ సాదాసీదాగా పనిచేస్తుండటం నమ్మశక్యంగా అనిపించలేదని వాకర్స్ అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు గ్రంథాలయ అధికారి నాగరాజు, మరొక విద్యార్థి రాత్రంతా కళాశాలలోనే ఉండి పొద్దున్నే కాలేజీకి స్వయంగా రంగులు వేస్తున్నారని వారు వెల్లడించారు.
Also Read
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!

ఈ మేరకు వాకర్స్ ప్రిన్సిపల్ పెయింట్ వేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీ నీటుగా ఉండేందుకు ప్రిన్సిపాల్ బీమార్జున్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని.. నిధులు లేకపోయినా అంకితభావం, పట్టుదలగా పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చారని.. కాలేజీని గ్రీనరీ మయం చేశారని కొనియాడుతున్నారు. కొందరు ఉద్యోగులు సమయానికి కళాశాలకు రావటమే గగనంగా మారిన ఈ రోజుల్లో రాత్రులు కళాశాలలోనే ఉండి కాలేజీ గురించి ఆలోచించడం అభినందనీయమని అంటున్నారు. మొత్తం కాలేజీలో 14 మంది అధ్యాపకులు, 350 మంది విద్యార్థులు ఉన్నారని ప్రిన్సిపాల్ చెప్పినట్లు వాకర్స్ తెలిపారు. ప్రతి పనికి లంచం తీసుకునే ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ, నిబద్ధత గల ప్రిన్సిపాల్ హుజూర్ నగర్ డిగ్రీ కళాశాలకు దొరకడం నిజంగా ఓ వరమని పేర్కొన్నారు.
Srisailam Project: నిపుణుల కమిటీ హెచ్చరిక.. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!