Srisailam Project: నిపుణుల కమిటీ హెచ్చరిక.. శ్రీశైలం డ్యామ్ భద్రతకు ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న శ్రీశైలం జలాశయానికి అంచనాలకు మించి వచ్చే వరద నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని నిపుణుల కమిటీ హెచ్చరించింది. లేకపోతే శ్రీశైలం డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని కమిటీ స్పష్టం చేసింది. కొత్తగా స్పిల్ వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి కాల్వ, ఎడమ కాల్వల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను పరిశీలించాలని నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. ప్లంజ్పూల్ సహా డ్యాం, స్పిల్వేకు మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫారసు చేసింది.
శ్రీశైలం డ్యామ్ భద్రతపై కొన్నేళ్లుగా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే పలు కమిటీలు ఎన్ని సిఫారసులు చేసినా అవి ఆచరణకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా ఛైర్మన్గా కమిటీ ఏర్పాటైంది. 2021లో సీడబ్ల్యూసీ శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి అధికారులకు ఓ నివేదిక సమర్పించింది. గత కమిటీల సిఫారసులు, సీడబ్ల్యూసీ పరిశీలనలో తేలిన అంశాలు, చర్యలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యానికి తగినట్లు లేదని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యం 13.2 లక్షల క్యూసెక్కులు మాత్రమే అని తెలిపింది. గరిష్ట నీటిమట్టం 890 అడుగులను పరిగణననలోకి తీసుకుంటే స్పిల్ వే సామర్థ్యం 14.55 లక్షల క్యూసెక్కులుగా ఉండాలని తేల్చి చెప్పింది.
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!