Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Huzurabad Politics Heated Up Again

మళ్లీ వేడెక్కిన హుజురాబాద్‌.. రేపే కౌంటింగ్‌..

Published Date :November 1, 2021 , 8:58 am
By Gogikar Sai Krishna
మళ్లీ వేడెక్కిన హుజురాబాద్‌.. రేపే కౌంటింగ్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం బర్తరఫ్‌ చేసింది. దీంతో ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటల. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఉప ఎన్నికకు దారితీసింది. హుజురాబాద్‌ లో మరోసారి టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేసేందుకు కేసీఆర్‌ తన అనుచర గణాన్ని మొత్తం ఉపయోగించారనడంలో సందేహం లేదు. హుజురాబాద్‌ గడ్డమీద గులాబీ జెండా రెపరెపలాడించాలని గెల్లు శ్రీనివాస్‌ ను అభ్యర్థిగా ప్రకటిస్తూ.. మంత్రి హరీశ్‌రావుకు ఇంచార్జీ బాధ్యతలు కేసీఆర్‌ అప్పగించారు.

అయితే ఆరోపణలతో రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన ఈటల మొదటి నుంచి నియోజవకర్గంలో ప్రచారం నిర్వహిస్తూ… ప్రజలను ఆకర్షించేందుకు పలు వ్యూహాలు పన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌ను అధిష్టానం ఈ ఉప ఎన్నిక బరిలో దించింది. వీరితో పాటు మరో 27 మంది బరిలో ఉన్నా.. పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యనే ఉండబోతోందని మొదటినుంచి సర్వేలు చెబుతున్నాయి. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు అక్టోబర్‌ 30న పోలింగ్‌ పూర్తి అయ్యింది.

Also Read

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
  • Off The Record : తెలంగాణ బీజేపీ నేతల తీరును ఎండగడుతున్న సొంత కేడర్
  • Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
  • Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 306 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పొలింగ్‌ ప్రారంభం నుంచి పలు చోట్ల చిన్నచిన్న ఘర్షణల, వాగ్వాద ఘటనలు చోటు చేసుకున్నా మిగితా పోలింగ్‌ అంతా ప్రశాంతంగా ముగిసింది. కానీ.. పోలింగ్‌ నిర్వహించిన అనంతరం ఈవీఏంలను తరలిస్తుండగా వీవీ ప్యాట్‌లను మార్చరంటూ ఓ వీడియో వైరల్‌ అవడంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ కలిసిన బీజేపీ నేతలు సీబీఐతో విచారణ జరుపాలంటూ వినతిపత్రం అందజేశారు.

ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న శశాంక్‌ గోయల్‌ కూడా కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారులకు సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ హుజురాబాద్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రేపే ఓట్ల లెక్కింపు ఉండడంతో వీవీ ప్యాట్‌లు మార్చిన వీడియో ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోపై రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌ రెడ్డి.. ఉపయోగించని వీవీ ప్యాట్‌ను స్ట్రాంగ్‌ రూంకు ప్రభుత్వ వాహనంలోనే తరలిస్తుండగా ఈ వీడియో తీశారని.. ఎవ్వరూ దీనిపై అనుమానం పెట్టుకోవద్దంటూ వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. పోలింగ్‌ కేంద్రాల నుంచి కరీంనగర్‌ స్ట్రాంగ్‌ రూంకు వెళ్లే దారిలో బస్సులు పలు చోట్ల ఆగాయని.. ఈవీఏంలను మార్చారంటూ బీజేపీ నేతలు మరో ఆరోపణకు తెరలేపారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఆది నుంచే ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. పోలింగ్‌ ప్రశాంతంగా ముసిందనుకున్న అధికారులకు ఈ వీడియో వైరల్‌ కావడంతో మరో తలనొప్పిగా తయారైంది. పోలింగ్‌ ముగిసే సమయానికి పలు సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి గెలుస్తుందనే ఫలితాలు వెలువడ్డాయి. సర్వేల్లే బీజేపీ గెలుస్తుందనే విషయం తెలిసి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఇంత అన్యాయానికి ఒడిగడతారా అంటూ ఈటల మండిపడ్డారు. ఏదీఏమైనా రేపు జరుగనున్న ఓట్ల లెక్కింపుతో హుజురాబాద్‌లో పొలిటికల్‌ హీట్‌కు తెరపడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Huzurabad by-election
  • Huzurabad bypoll
  • huzurabad counting

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions