Telangana: వైన్ షాపుల టెండర్లకు భారీ స్పందన.. మూడు రోజుల్లోనే 2000 దరఖాస్తులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన లభిస్తోంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండువేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయంటే మనవాళ్లతోటి అట్లుంటది అనిపిస్తుంది. వైన్ షాపుల కోసం భారీ పోటీ నెలకొంది. ఎంతలా అంటే.. మూడు రోజుల్లోనే రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు డిమాండ్ మామూలుగా లేదు. దీంతో… ఈసారి మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుంటే.. కాసుల వర్షం కురుస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గాను సోమవారం (ఆగస్టు 8) 2000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు కింద 2 లక్షలు చెల్లిస్తున్నారు. 2023-25 నాటికి తెలంగాణలో మద్యం దుకాణాలకు కొత్త లైసెన్సులు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా.. కొత్త లైసెన్సుల కోసం ఈ నెల 4 నుంచి ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
Read also: Rahul Gandhi: రాహుల్కు అధికార నివాసంగా ఆ బంగ్లానే కేటాయింపు !
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా రాజకీయ నేతలు, వారి అనుచరులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల్లో రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో మిగిలిన 3 రోజుల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచే 350 దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 చివరి తేదీ. ఇప్పుడు ఇలా దరఖాస్తులు వెల్లువెత్తుతుంటే.. అప్పటికి ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయో..! 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వచ్చిన దరఖాస్తులన్నింటి నుంచి లాటరీ విధానంలో ఆగస్టు 21వ తేదీన మద్యం షాపుల లైసెన్స్లు కేటాయిస్తారు.
గత నోటిఫికేషన్ లో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కింద రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈసారి అంతకంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చూద్దాం.. ఎన్నికల జాతరలో ఖజానాకు ఎన్ని కోట్లు వస్తాయో..!!
Perni Nani : రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర.. చంద్రబాబుది శకుని మెదడు
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!