Perni Nani : రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర.. చంద్రబాబుది శకుని మెదడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు అధికారం కోసం ఎంత చెడ్డ పని చేయటానికి అయినా ఒడికడతాడని అందరికీ తెలుసు.. కానీ ఇప్పుడు మరింత బరితెగింపు చూపిస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే 10 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయినా పర్వాలేదు అనే రౌడీయిజం చంద్రబాబు చేస్తున్నారని, పోలీసుల పై దాడులు చేసి అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నాడని పేర్ని నాని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనే కుట్ర పన్నాడు చంద్రబాబు అని, చంద్రబాబుది శకుని మెదడంటూ ఆయన మండిపడ్డారు.
Also Read : NC 23: జాలరిగా నాగచైతన్య.. అమాంతం అంచనాలు పెంచేస్తున్న ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్
Also Read
టీడీపీకి మరోసారి వాత పెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్ని నాని అన్నారు. 1995 నుండి రాయలసీమకు నీళ్లివ్వకుండా చంద్రబాబు ఏం చేశారు? అని ప్రశ్నించిన పేర్ని నాని… అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందని హెద్దేవా చేశారు. 35 ఏళ్లుగా గెలుస్తోన్న తమ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా మొగాడే అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం ఏది? అంటే ఏం చెబుతారన్నారు నాని. చంద్రగిరిలో గెలిచారా? కుప్పంలో ఎందుకున్నారని నిలదీశారు. అంతేకాకుండా.. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పేర్ని కౌంటర్ ఇచ్చారు. దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుందని, చిరంజీవి రెమ్యునరేషన్ గురించి ఎప్పుడైనా అడిగారా?? అని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి నా అభిమాన నటుడు అని వ్యాఖ్యానించారు పేర్ని నాని.. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నారు? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Alia Bhatt: ‘వండర్ విమెన్’ కు తెలుగు నేర్పిన అలియా.. మీకు నా ముద్దులు అంటూ రచ్చ
‘ఇన్నేళ్ళల్లో ఏ రాజకీయ పార్టీ కూడా పోలీసుల పై దాడి చేసిన ఘటనలు జరుగలేదు. చంద్రబాబుకే కాదు ఏడాది వయసు ఉన్న మనవడికి కూడా పోలీసులే భద్రత కల్పించాలి. మళ్ళీ అదే పోలీసుల పై చంద్రబాబు దాడులు చేయిస్తాడు. పోలీసుల పై వాడికి కుట్రదారుడు చంద్రబాబే. పేర్ని నాని ఇక్కడే బతుకుతున్నాడు… చస్తే శవాన్ని ఇక్కడే పూడుస్తారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉండడు… చస్తే శవం కూడా ఇక్కడికి రాదు. పోలీసులు లేకపోతే వీళ్ళకు భయం. లోకేష్ పోలీసుల సంగతి చూస్తాడట. పోలీసులు లేకపోతే గడప దాటి అడుగు కూడా పెట్టలేడు. ఎస్పీ రిషాంత్ రెడ్డి కళ్ళకు ఆపరేషన్ చేస్తాననటం లోకేష్ బలుపు. పోలీసోడికి కులం ఉంటుందా? పుంగనూరు మారణకాండలో చంద్రబాబును మొదటి ముద్దాయిగా పరిగణించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.’ అని పేర్ని నాని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!