Narayanpet: పిల్లలు చనిపోతే కానీ స్పందించరా.. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్..
- మాగనూర్ జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కల్తీపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించిన హైకోర్టు..
- పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించిన హైకోర్టు..
- అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న హైకోర్టు..
- ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayanpet: ఫుట్ పాయిజన్ తో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన ఘటన మరువక ముందే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మాగనూర్ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టు ఇవాళ విచారించింది. దీనిపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని తెలిపారు. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇది చాలా సీరియస్ అంశమని సీజే తెలిపారు.
పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సంఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకుని సీజే ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అని ప్రశ్నించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని తెలిపింది. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా అని తెలిపింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏఏజీ అందిస్తామన్నారు.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
Read also: V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
నారాయణపేట జిల్లా మాగనూరులో ఫుట్ పాయిజన్కు గురైన 20 మంది విద్యార్థులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహబూబ్ నగర్ ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బయట చిరుతిల్లు తిండి తినడం వల్లనే నని ఫుట్పాయిజన్ అయ్యిందని మాఘనూరు అధికారుల అంటున్నారు. కాగా.. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ ఉడకని అన్నం, వంకాయ ఆలుగడ్డ పెట్టారని చెబుతున్నారు. వారు తాగిన నీరు కూడా సరిగా లేదని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఎవరూ బయట చిరుతిల్లు తినలేదని అంటున్నారు.
మేమందరం పాఠశాల భోజనం తినండం వల్లే అస్వస్థలకు గురయ్యామని అన్నారు. మరోవైపు మాగనూరు వైద్యం పొందుతున్న విద్యార్థులను కలిసేందుకు వెళుతున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్కూల్ వద్ద పోలీలసు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మాగనూరు గ్రామాన్ని పోలీసులు దిగ్బంధంలో తీసుకున్నారు. ఎవరికిని మాగనూరులోకి అనుమతించడం లేదు. మాగనూరు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సిక్త పట్నాయక్ సందర్శించారు. వంట గది, కూరగాయలు, వంట సామాగ్రి పరిశీలించారు. వంట చేస్తున్న సిబ్బందితో వివరాలు సేకరించారు.
Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..
తాజావార్తలు
-
Trinamool Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ఇలా చేసిందేంటి..
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!