High Court: సెల్లార్ నిర్మాణాలపై అనుమతి తీసుకోవాలి.. హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: అపార్ట్మెంట్లోని బేస్మెంట్లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టవచ్చని, అయితే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చింది. హైదరాబాద్లోని మోహన్ నగర్లోని సీటీఓ కాలనీలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ బిల్డర్ కె.రమేష్ సెల్లార్లో వాచ్మెన్ గది నిర్మాణంపై ఈ నెల 7న జీహెచ్ఎంసీ జారీ చేసిన పోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల విస్తీర్ణంలో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్లో వాచ్మెన్ గదిని నిర్మించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చామని, దీనిపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ కు అవకాశం ఉందని మున్సిపల్ శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. వాచ్ మెన్ గది నిర్మాణానికి అనుమతి తీసుకోవాలన్నారు.
Read also: ‘Kalki 2898 AD’ Release Date:కల్కి వాయిదా లేదు.. ఒక్క పోస్టుతో నోళ్లు మూయించారు..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, ఈ నెల 24లోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది. అంతే కాకుండా వాచ్మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు, పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు (అప్లికేషన్స్) చేస్తే, దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. క్రీడాభివృద్ధిలో భాగంగా ఐఎంజీకి అప్పగించిన భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని మరో కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు కంపెనీకి అప్పగించిన భూమికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూముల బదలాయింపు కేసులో ప్రభుత్వమే దోషి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 28కి వాయిదా వేసింది.
Dhoni : క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తోన్న ధోనీ
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!