High Court: సెల్లార్ నిర్మాణాలపై అనుమతి తీసుకోవాలి.. హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: అపార్ట్మెంట్లోని బేస్మెంట్లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వీటి నిర్మాణం చేపట్టవచ్చని, అయితే ముందస్తు అనుమతి తప్పనిసరి అని తేల్చింది. హైదరాబాద్లోని మోహన్ నగర్లోని సీటీఓ కాలనీలోని అన్నపూర్ణ అపార్ట్మెంట్ బిల్డర్ కె.రమేష్ సెల్లార్లో వాచ్మెన్ గది నిర్మాణంపై ఈ నెల 7న జీహెచ్ఎంసీ జారీ చేసిన పోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 500 చదరపు గజాల విస్తీర్ణంలో 15 ప్లాట్లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్లో వాచ్మెన్ గదిని నిర్మించామని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీన్ని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. భవన నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కేవలం షోకాజ్ నోటీసు మాత్రమే ఇచ్చామని, దీనిపై వివరణ ఇచ్చేందుకు పిటిషనర్ కు అవకాశం ఉందని మున్సిపల్ శాఖ తరఫు న్యాయవాది తెలిపారు. వాచ్ మెన్ గది నిర్మాణానికి అనుమతి తీసుకోవాలన్నారు.
Read also: ‘Kalki 2898 AD’ Release Date:కల్కి వాయిదా లేదు.. ఒక్క పోస్టుతో నోళ్లు మూయించారు..
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిబంధనల ప్రకారం వాచ్మెన్ గది నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఇక్కడ పిటిషనర్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారని, ఈ నెల 24లోగా షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశించింది. అంతే కాకుండా వాచ్మెన్ గది నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. షోకాజ్ నోటీసుపై వివరణతో పాటు, పిటిషనర్ క్రమబద్ధీకరణ దరఖాస్తు (అప్లికేషన్స్) చేస్తే, దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. క్రీడాభివృద్ధిలో భాగంగా ఐఎంజీకి అప్పగించిన భూమిని రిజిస్ట్రేషన్ రద్దు చేయడంపై బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని మరో కేసులో హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు కంపెనీకి అప్పగించిన భూమికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏకపక్షంగా భూముల బదలాయింపు కేసులో ప్రభుత్వమే దోషి అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం 28కి వాయిదా వేసింది.
Dhoni : క్రికెట్ వదిలి ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తోన్న ధోనీ
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!