Heat Waves: ఎండలేదని ఎంజాయ్ చేస్తున్నారా.. ముందుంది ముసళ్ల పండగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heat Waves: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండలు బండులు పగిలే మండుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో 45 డిగ్రీలు ఉంటుంది. వేసవి కాలంలో అడపాదడపా వర్షాలు కురిసినా ఎండలు మండిపోతున్నాయి. కానీ ఈసారి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది. భానుడు భగభగ మండుతున్న సమయంలో వరుణుడు కుండపోత వర్షాలు కురిపిస్తున్నాడు. వాతావరణం పూర్తిగా చల్లబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి వర్షాకాలంగా మారిపోయింది. ఇది వర్షాకాలమా? ఇది వేసవి కాలమా? అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.
కాగా.. రానున్న రోజుల్లో భానుడు మళ్లీ తన ప్రతాపం చూపించనున్నాడు. మే 8 నుంచి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నా.. మళ్లీ భానుడు తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడని అంటున్నారు. మే 8 నుంచి రాష్ట్రంలో తీవ్ర వేడి గాలులు వీస్తాయని.. వర్షాలు పూర్తిగా ఆగిపోయాయని, ప్రతి రోజూ వేడిగాలులు వీస్తాయని చెబుతున్నారు. ప్రతి ఏడాది వేసవి మాదిరిగానే ఈ ఏడాది కూడా మే 8 తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడిస్తున్నారు.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
Read also: Rangareddy Crime: కన్న బిడ్డను అమ్మింది.. సంచిలో శవమైంది
అయితే చల్లటి వేసవి త్వరలో వేడి వేసవిగా మారుతుందని తెలిసి చాలా మంది నిరాశ చెందగా, మరికొందరు వర్షాల కంటే ఎండలు మంచివని అంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని.. ఈ సమయంలో కురుస్తున్న వర్షాల కంటే ఎండలు బాగానే ఉన్నాయని అంటున్నారు. వర్షాకాలంలోనే వర్షాలు కురిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వారం చివరి వరకు వర్షాలు..
మరోవైపు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వారం చివరి వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలతో పాటు భారీ ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్.. రేపటి నుంచి 7 వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Ilayaraja : ఇళయరాజా ఇంట్లో విషాదం..
తాజావార్తలు
-
RCB: ప్లేఆఫ్స్ ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ సీజన్ మొత్తానికి దూరం
-
Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్కు హెచ్చరిక
-
Shreyas Iyer: 146 మ్యాచ్ల తర్వాత శ్రేయస్ తొలి ఐపీఎల్ సెంచరీ.. ఛేజింగ్ చేస్తూ అరుదైన ఘనత
-
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?