తెలంగాణలో లాక్డౌన్..! క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.. అయతే, నిన్న హోంశాఖమంత్రి మహమూద్ అలీ.. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం.. లాక్డౌన్పై సీఎం కేసీఆర్దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో.. ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. అసలు లాక్డౌన్ పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇక, రేపటి నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్లు ప్రారంభిస్తామన్న ఈటల.. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని కీలక సూచనలు చేశారు..
మరోవైపు.. మందులు, ఆక్సిజన్ ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఈటల రాజేదర్.. రాష్ట్రంలో ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన రోగులకు కూడా చికిత్స అందిస్తున్నామన్న ఆయన.. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో 1.75 కోట్ల మంది యువత ఉన్నారు.. మాకు రెండు డోసులకు 3.50 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్న ఆయన.. వాక్సిన్ విషయంలో కేంద్రం పునరాలోచించాలన్నారు.. కేంద్రమే వాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ఇక్కడ ప్లాన్ చేస్తామన్నారు ఈటల. కరోనా ట్రీట్మెంట్లో ఆక్సిజన్ కీలకం.. ఇప్పటికి కేంద్రం 360 మెట్రిక్ టన్నులు కేటాయించింది.. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను తెలంగాణ కు కేటాయించాలని కోరారు.. కేంద్రం నియంత్రణ చేయటం కాదు.. రాష్ట్రాల అవసరాలు తీర్చాలన్న ఆయన.. కావాల్సిన అవసరాలు తీర్చటం కేంద్రం బాధ్యత.. అవసరం అయితే, రాష్ట్రాల షేర్ అడగండి అన్నారు..
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
కేంద్రం సెకండ్ వేవ్ వస్తోంది అని చెప్పింది.. కానీ, ఇంత తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరించలేదన్న ఆయన.. తీవ్రంగా ఉండదనే ఎన్నికలు పెట్టారు కదా..? అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం.. ఈ పరిస్థితిని దేశాల వారీగా చూస్తున్నారు.. రాష్టాల వారీగా చూడటం లేదన్న ఈటల.. కేంద్రం చెప్పిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాం.. మమ్మల్ని విమర్శిస్తోంది వాళ్లు.. విమర్శలకు సమాధానం చెబుతున్నాం అన్నారు. దేశం విపత్తు.. కేంద్రం పట్టించుకోవాలి.. కానీ, కొన్ని విషయాల్లో కేంద్రం స్పందన సరిగ్గా లేదన్నరు ఆరోగ్యశాఖ మంత్రి.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!