వైద్యం వికటించి మహిళ మృతి.. 2 లక్షలు కడితేనే మృతదేహం అంటున్న వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యం వికటించి మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓజోన్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం రాందిగల్ల గ్రామానికి చెందిన ఈదుల అంజనమ్మ (35), ఈదుల కృష్ణయ్య భార్యభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. భర్త కృష్ణయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా, అంజనమ్మ వ్యవసాయ కూలీలకు వెళ్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. కాగా అంజనమ్మకు 3 నెలల క్రితం వ్యవసాయ కూలీ పనులు చేస్తుండగా కాలికి దెబ్బ తగిలింది.
దీంతో కొన్ని రోజులకు కాలు ఇన్ఫెక్షన్ కాగా గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓజోన్ ఆస్పత్రిలో చేర్పించారు. గత 47 రోజులుగా అంజనమ్మ ఓజోన్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది. ఇందుకుగాను రూ.13 లక్షల ఆసుపత్రి బిల్లు చెల్లించారు. గత రాత్రి వరకు అంజనమ్మ ఆరోగ్యం బాగానే ఉందని రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి గడిచేసరికి చనిపోయిందని మరో రూ. 2 లక్షల బిల్లు చెల్లిస్తేనే అంజనమ్మ మృతదేహాన్ని ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పడంతో మృతురాలి బంధువులు హాస్పటల్లో ఆందోళనకు దిగారు.
Also Read
తాజావార్తలు
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
-
West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
-
Dancers Union Clash: పోలీసుల వద్దకి సినీ డాన్సర్స్ యూనియన్ పంచాయతీ!
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!