BRS vs Congress : హత్నూరలో కాంగ్రెస్-బీఆర్ఎస్ బాహాబాహీ..
- సంగారెడ్డి హత్నూరలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
- రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
- అదేసమయంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
- ఇది ప్రభుత్వ కార్యక్రమమా..? అధికారిక కార్యక్రమమా..? అని వారించిన ఎమ్మెల్యే సునీత
- రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని చింపివేసేందుకు ప్రయత్నించిన BRS కార్యకర్తలు
- ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS vs Congress : సంగారెడ్డి జిల్లా హత్నూరులో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది.
Also Read
- LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Heavy Rains: తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు.. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు!
- OTR : దేశ రాజధానిలో తెలంగాణకు కేర్ ఆఫ్ లేకుండా పోతుందా?
“ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా, లేక పార్టీ కార్యక్రమమా?” అని ప్రశ్నించారు.
IND vs ENG: జైస్వాల్కు బయపడి.. అంపైర్కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!
ఈలోగా, అక్కడికొచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని చింపివేయడానికి ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను సభా ప్రాంగణం నుండి బయటకు పంపి పరిస్థితిని నియంత్రించారు. అయితే ఘర్షణతో కార్యక్రమం తాత్కాలికంగా అంతరాయం కలిగింది.
ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు నమోదు చేసుకున్నాయి. ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో వరుసగా రాజకీయ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరింత చర్చనీయాంశమైంది.
PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ కాలేదా..? అయితే ఇలా చేయండి..
తాజావార్తలు
-
LIG Housing Scheme: లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు పెట్టండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి.!
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
Jayam Ravi : మరో వివాదంలో చిక్కుకున్న జయం రవి.
-
Bill Gates: “అవును, నాకు ఆ ముగ్గురితో ఎఫైర్ ఉంది”.. ఎప్స్టీన్ ఫైల్స్ విచారణలో బిల్ గేట్స్ షాకింగ్ స్టేట్మెంట్
-
OnePlus 16T: వన్ప్లస్ 16T వచ్చేస్తోంది.. 6.3 ఇంచెస్ హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే.. స్నాప్ డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్
ట్రెండింగ్
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!