BRS vs Congress : హత్నూరలో కాంగ్రెస్-బీఆర్ఎస్ బాహాబాహీ..
- సంగారెడ్డి హత్నూరలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
- రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
- అదేసమయంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
- ఇది ప్రభుత్వ కార్యక్రమమా..? అధికారిక కార్యక్రమమా..? అని వారించిన ఎమ్మెల్యే సునీత
- రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని చింపివేసేందుకు ప్రయత్నించిన BRS కార్యకర్తలు
- ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS vs Congress : సంగారెడ్డి జిల్లా హత్నూరులో శుక్రవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ ఘర్షణలకు వేదికైంది. ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం క్రమంగా కాంగ్రెస్-బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇది కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే జరగడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తమైంది.
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
“ప్రభుత్వ పథకాల పంపిణీ వేదికను రాజకీయ ప్రచార వేదికగా మార్చడం సమంజసం కాదు. ఇది అధికారిక కార్యక్రమమా, లేక పార్టీ కార్యక్రమమా?” అని ప్రశ్నించారు.
IND vs ENG: జైస్వాల్కు బయపడి.. అంపైర్కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!
ఈలోగా, అక్కడికొచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని చింపివేయడానికి ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలను సభా ప్రాంగణం నుండి బయటకు పంపి పరిస్థితిని నియంత్రించారు. అయితే ఘర్షణతో కార్యక్రమం తాత్కాలికంగా అంతరాయం కలిగింది.
ఈ ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు నమోదు చేసుకున్నాయి. ఇటీవల నర్సాపూర్ నియోజకవర్గంలో వరుసగా రాజకీయ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటన మరింత చర్చనీయాంశమైంది.
PM Kisan Yojana: పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ కాలేదా..? అయితే ఇలా చేయండి..
తాజావార్తలు
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!