Harish Rao : హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజల సేవకులమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజలకు సేవకులం అని, వారికి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాక మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. అవసరం లేకున్నా గర్భిణులకు కడుపు కోతలు అవుతుంటే, బాధ అనిపిస్తుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
సిజెరియన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెరిగేలా చేయడంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ ఆఫీసర్ల పాత్ర కీలకమని ఆయన అన్నారు. కరోనా సమయంలో బాగా పని చేశారని, అదే తీరును కొనసాగించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్… పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, మందులు, సిబ్బంది, వైద్య పరికరాల కొరత లేకుండా చూస్తున్నారని, కాబట్టి నూతనోత్సాహంతో పని చేసి అరోగ్య శాఖకు మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం