Harish Rao : రూ.50,000 కోట్ల పవర్ స్కామ్ – హరీష్ రావు బాంబ్.!
- రేవంత్ ప్రభుత్వంపై మరోసారి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
- పవర్ ప్రాజెక్టుల్లో రూ.50 వేల కోట్ల అవకతవకలు జరుగుతున్నాయి
- ఎన్టీపీసీ చౌక విద్యుత్ ఎందుకు తిరస్కరించారో ప్రశ్నించిన హరీష్
- “ప్రతి నిర్ణయంలో కమీషన్… ఇదే రేవంత్ పాలన” – హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అక్షరాల రూ.50 వేల కోట్ల భారీ మోసం జరుగుతోందని, దీనిలో 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు.
రాష్ట్రంలో విధాన నిర్ణయాల కోసం నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాలు, ఇప్పుడు పంపకాల కోసం మాత్రమే జరిగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాలు వరుసగా భూ స్కాం, పవర్ స్కాం కోసం జరిగాయని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల ల్యాండ్ స్కాం ను బయట పెట్టినా, ప్రభుత్వం దానిపై ఒక్క సమాధానం కూడా చెప్పలేదని హరీష్ రావు మండిపడ్డారు.
Also Read
- CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో రూ.50 వేల కోట్ల భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “రేవంత్ ప్రభుత్వం చేసే ప్రతి పనిలో ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమిషన్” అని వ్యాఖ్యానిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలలో ప్రజల ప్రయోజనం కంటే స్వప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్కు అధికారం ఇస్తే అరాచకం రాజ్యమేలుతుందని కేసీఆర్ గతంలో చెప్పిన విషయం ఇప్పుడు నిజమవుతోందని హరీష్ వ్యాఖ్యానించారు. వాటాల విషయంలో తలెత్తిన అంతర్గత తగాదాల వల్ల మంత్రులే రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే వెంటనే డర్టీ పాలిటిక్స్కు తెర తీస్తున్నారని ఆరోపించారు.
ఎన్టీపీసీ తక్కువ ధరకే విద్యుత్ అందించేందుకు సిద్ధంగా లేఖ రాసినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్టీపీసీ ప్రతిపాదనను ఎందుకు తిరస్కరించారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దామరచర్లలో పవర్ ప్లాంట్ నిర్మాణంపై గతంలో తీవ్రంగా విమర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. “కమీషన్ కోసమే కోమటిరెడ్డి పెదవులు మూసుకున్నారా?” అని హరీష్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
పథకాల అమలుకు డబ్బుల్లేవని ప్రభుత్వం చెప్పుకుంటూనే, వేల కోట్లతో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్లను డబుల్ కాస్ట్తో నిర్మించడం అంటే కమీషన్ల కోసం చేస్తున్న ప్రాజెక్టులేనని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రతి రోజు తన మాటలను మార్చుకుంటారని, ‘రామ్-రెమో’ లెక్క రోజుకో కొత్త కథ చెబుతున్నారని హరీష్ వ్యాఖ్యానించారు.
26/11 Mumbai Attack: ముంబై టెర్రర్ దాడులకు 17 ఏళ్లు.. ఆనాటి హీరోలను ఎలా మరవగలం..
తాజావార్తలు
-
Marco Rubio: భార్యతో కలిసి జైపూర్ ప్రసిద్ధ కట్టడాలు సందర్శించిన మార్కో రూబియో
-
Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్పై సోషల్ మీడియాలో చర్చ..
-
Redmi 15 5G, Note 15 5G: భారీగా పెరిగిన రెడ్మీ 5G ఫోన్ల ధరలు!.. కొత్త ధరలు ఇవే
-
Tollywood : మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు
-
CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?