Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై హరీష్ రావు సంచలన ట్విట్..
- రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు..
- ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం..
- విద్య -విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం..
- నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది..
- ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ట్విట్ చేశారు. జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాలేదని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. విద్య, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రజారంజక పాలన అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఇదే నిదర్శనమని అన్నారు. 422 జూనియర్ కళాశాలల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన 1లక్ష 60వేల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
Read also: CM Revanth Reddy: వారికి మాత్రమే అవకాశం.. ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కండిషన్..
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
వారికి నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో జీరో అడ్మిషన్లపై ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యూవల్ చేయాలని కోరారు. కొత్తగా మంజూరైన జూనియర్ కళాశాలల్లో పోస్టులు మంజూరు చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై
19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం.ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 19, 2024
Crime News: సినీఫక్కీలో మహిళ హత్య.. ఒక రోజు ముందు రిహార్సల్ చేసి మరీ..
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..