Harish Rao: రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థులు మూడవ స్థానానికే పరిమితం అవుతారన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండాని తెలిపారు.
Read also: Killi Krupa Rani: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి..
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
హామీలు అమలు కాకపోతే బీఆర్ఎస్ కు ఓటేయండి అన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే… బీఆర్ఎస్ గెలవాల్సిందే అన్నారు. ఇచ్చిన హామీల అమలుపై మంత్రులు బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో లీకేజీలు ఇస్తూ పాలన చేస్తున్నారన్నారు. కేసిఆర్ పర్యటన తర్వాతే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు…. కరీంనగర్ వరద కాలువకు నీటి విడుదల జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికాగానే కరెంటు, నీటి బిల్లులు పెంచుతారన్నారు. బీజేపీ పాలనలో అన్ని వర్గాలు దగాపడ్డాయన్నారు. జాతీయ పార్టీలు గెలిస్తే ఢిల్లీకి గులాంగిరి చేస్తాయన్నారు.
Read also: Elections 2024: ఇదేం ‘చిల్లర’ నామినేషన్ రా బాబోయ్.. దెబ్బకు చెమటలు చిందించిన ఎన్నికల అధికారులు..!
కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఎప్పుడూ అధికారంలో లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ గ్రూపు తగాదాలే పడగొడతాయని తెలిపారు. ఉద్యమం సమయంలోను బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లారని, పైరవీ కారులు, కాంట్రాక్టర్ లు పార్టీని విడిచిపోతున్నారన్నారు. పార్టీని విడిచి పోయిన వారిని కాళ్ళు మొక్కినా తిరిగి చేర్చుకోమన్నారు. బీజేపీ నుండి నలుగురు ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. కార్యకర్త లకు తెలంగాణ భవన్ లో లీగల్ టీమ్, ముఖ్య నేతలు అందుబాటులో ఉంటారన్నారు. పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరను బీఆర్ఎస్ పార్టీ గమనిస్తుంది.. త్వరలోనే అవకాశం వస్తుంది గట్టిగా సమాధానం చెప్తామన్నారు.
BRS KTR: అసత్య ఆరోపణలు చేస్తే సీఎం అయినా, మంత్రికైనా తాట తీస్తా..!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!