Harish Rao: కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది.. బడ్జెట్లో వాటికి రూపాయి ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao Responds On Central Budget 2023: ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలేదని పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీలు, ఉపాధి హామీ కూలీలు, మహిళలు, విద్యార్థుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చేశారన్నారు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి, ఎన్నికలు జరగబోయే కర్ణాటకు మాత్రమే వరాలిచ్చి.. తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన హామీలో ఉన్న గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, ఇండస్ట్రీయల్ కారిడార్, ఇండస్ట్రీయల్ ఇన్సెటివ్స్, మెగా టెక్స్టైల్, ఫార్మా సిటీ మొదలైన వాటి గురించి తాము అడుగుతూనే ఉన్నామని.. అయితే కేంద్రం వాటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.
Cycling: సైక్లింగ్తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?
Also Read
- CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
- Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కేసు నమోదు
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
కేంద్రప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టిందని.. ఇది చాలా బాధాకరమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 30 వేల కోట్లు కోత పెట్టారని.. అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ విషయంలో రూ.50 వేల కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. పత్తి కొనుగోలు నుండి కేంద్రం తప్పుకుందా అని అనుమానం కలుగుతుందని సందేహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సీసీఐకి పత్తి కొనుగోలు విషయంలో బడ్జెట్లో పూర్తి స్థాయిలో కోత పెట్టారని వెల్లడించారు. గతంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందని, రాష్ట్రానికి ఒక్క ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. నర్సింగ్ కాలేజీ ఏర్పాటులో కూడా మొండి చేయి చూపారన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. అసలు తెలంగాణకు ఏమిచ్చారు? రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి
తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు, రైతు కూలీలకు అన్యాయం చేశారని.. ఇది అందరినీ తీవ్ర నిరాశను మిగిల్చిందని హరీశ్ రావు వాపోయారు. పెట్రోల్, డీజిల్పై సెస్తో పాటు గ్యాస్ సిలిండర్ ధర తగ్గిస్తారేమోనని అనుకున్నామని.. అలాగే పేద మధ్యతరగతి మహిళలకు ఏదైనా శుభవార్త చెప్తారేమోనని భావించామని.. కానీ చివరకు నిరాశే మిగిలిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్, నిరుద్యోగుల వ్యతిరేక బడ్జెట్, మహిళల వ్యతిరేక బడ్జెట్, రైతు కూలీల వ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు.
Rajagopal Reddy: ఓటమి భయంతోనే కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు
తాజావార్తలు
-
Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..
-
Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
-
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
-
AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
-
SRH vs RR Eliminator: ఎవరి బలహీనత వారికే ముప్పు.. ఎలిమినేటర్ మ్యాచ్పై ఆసక్తికర విశ్లేషణ!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!