Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
- విద్యుత్ కోతలపై హరీష్ ఫైర్ బొగ్గు కొరతపై తీవ్ర ఆరోపణలు ఉత్పత్తి సామర్థ్యం సగమేనన్న విమర్శ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని మండిపడ్డారు. “ఒకప్పుడు కరెంట్ పోతే వార్త.. కానీ ఈ చేతకాని ప్రభుత్వ పాలనలో ఇప్పుడు కరెంట్ ఉంటేనే వార్తగా మారింది” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే 11 జిల్లాల్లో భారీ ఎత్తున ధర్నాలు జరిగాయని, చాలా చోట్ల రైతులు ఆగ్రహంతో సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారని గుర్తుచేశారు. అప్రకటిత కరెంట్ కోతలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బొగ్గు కొరత, విచ్చలవిడి స్కామ్లు!
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 6 నుంచి 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కూడా లేకపోవడం వల్లే ఈ తీవ్రమైన విద్యుత్ సమస్య తలెత్తిందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కనీస నిర్వహణ లోపం వల్ల బొగ్గు నిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా కుంటుపడిందని స్పష్టం చేశారు. “ఈ ప్రభుత్వంలో బొగ్గు లో స్కాం, పవర్ లో స్కాం, సాండ్ (ఇసుక) లో స్కామ్లు విచ్చలవిడిగా బయటపడుతున్నాయి” అని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 33 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా తాము నిరంతరం ప్రభుత్వాన్ని నిద్రలేపుతున్నా, పాలకుల్లో కనీస ఉలుకూ పలుకూ లేదని ధ్వజమెత్తారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
7,180 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా.. ఉత్పత్తి సగమే
తెలంగాణ రాష్ట్రంలో సరిపడా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల కేవలం 3,190 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇంధన శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కనీస బాధ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలకు కనీసం 8 గంటల విద్యుత్ను కూడా అందించలేకపోతున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!