CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసిన తాను, సరిగ్గా 30 సంవత్సరాల తరువాత 2026 ఆగస్టు 31న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేయడం జీవితంలో మర్చిపోలేని అత్యంత భావోద్వేగ సందర్భమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి, శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మను మార్కాపురం చెన్నకేశవుడు కొలువైన నేలకు తీసుకువచ్చి జలహారతి ఇవ్వడం తన అదృష్టమని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు, నిర్వాసిత కుటుంబాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు మొదటి దశను రూ.7,983 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని, దీనివల్ల నల్లమల సాగర్కు 10.70 టీఎంసీల నీరు చేరుతుందని వివరించారు. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించామని, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లించడమే కాకుండా 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు లభిస్తుందని, దీంతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ కష్టాలు ముగిసిపోతాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాడిన అమరజీవి పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందలను సీఎం వేదికపై సన్మానించారు. తమ తండ్రి ఆశయమైన వెలిగొండను పూర్తి చేసినందుకు పూల సుబ్బయ్య కుమార్తెలు సీఎం చంద్రబాబుకు కాళ్లకు నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వం రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్లో ఉంచి, సొరంగంలో టీబీఎం యంత్రం ఇరుక్కుపోయినా పనులు పూర్తి చేశామంటూ డ్రామాలు ఆడిందని తీవ్రంగా విమర్శించారు. రూ.1900 కోట్లతో వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా 2028 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని, దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే 3 ఏళ్లలో 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేలా క్యాలెండర్ విడుదల చేశామని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!