Karimnagar: ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: తెలంగాణలో పందెం కోడి కేసు హాట్ టాపిక్ గా మారింది. గత నాలుగు రోజులుగా కోడి వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇవాళ కోడి వేలం పాటకు ఆర్టీసీ అధికారులు టైం ఫిక్స్ చేశారు. అయితే కోడి విషయంలో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కోడి నాదే అంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ అధికారులను కోరడంతో సంచలనంగా మారింది. ఆ కోడి నాదే సార్ నాకోడి నాకు ఇచ్చేయండి అంటూ తెలిపాడు. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రకాశం జిల్లా రుద్రంగికి చెందిన మహేష్ అనే వ్యక్తి కోడి నాదే.. నాకు అప్పగించాలని ముందుకు వచ్చాడు. మహేష్ రుద్రంగిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కోడిని అప్పగించాలని మహేష్ కోరుతున్నాడు. అంతేకాకుండా అతను తన ఇంట్లో, పెరట్లో కోడి తిరుగుతున్న వీడియోలతో సహా పంపించడం గమనార్హం. ఈ కోడి నాదే అంటూ వీడియోలు, ఫోటోలు పంపించినా ఆర్టీసీ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. నీదే అని గ్యారెంటీ ఏమిటి? కోడిని నీకు ఇచ్చేదే లేదని ఖరా ఖండిగా చెప్పేశారు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇవాళ మధ్నాహ్నం వేలం వేస్తున్నామంటే నీకోడి అని గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. కోడిని ఇచ్చేదే లేదని స్పస్టం చేశారు.
Read also: Supreme Court: ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
కోడి కేసులో అటు కోడి యజమాని, ఇటు కోడిని బంధించి ఆర్టీసీ యాజమాన్యం పెద్ద చిక్కేవచ్చిపడింది. మరి ఆ కోడిని యజమాని మహేష్ కు ఇస్తారా? లేక మధ్నాహ్నం 3 గంటలకు వేలంపాటలో మహేష్ పాల్గొని వేలంపాట పాడి తీసుకోమంటారా? అనే ప్రశ్నలు లేవలెత్తున్నాయి. కాగా.. గత నాలుగు రోజులుగా కరీంనగర్ బస్టాండ్ రెండో డిపోలో ఓ కోడిపుంజు బందీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎవరూ రాకపోవడం, దానికి తోడు రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ రావడంతో ఆర్టీసీ దీనిని వేలం వేసేందుకు సిద్దమయ్యింది. కోడి వేలం వేసేందుకు ఇవాళ మధ్నాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కోడి యజమాని ఎంట్రీ ఇచ్చాడు. ఆ కోడి నాదే.. నా కోడిని నాకే ఇచ్చేయండి అంటూ ముందుకు రావడంతో ఆర్టీసీ యజమానులు షాక్ తిన్నారు. మరి ఇప్పుడు కోడి విషయంలో ఆర్టీసీ అధికారులు ఎలా స్పందించానున్నారో వేచి చూడాలి.
Trending News : నా వయసు 112ఏళ్లే… నాకు మొగుడు కావాలి.. కానీ నాదో కండీషన్..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!