Harish Rao: రైతుబంధుపై నేను తప్పుగా మాట్లాడలేదు..
Harish Rao: రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్రావు కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు. రైతు సోదరుడిని ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. డిసెంబర్ 3 వరకు ఆపగలరని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ మాత్రమే వచ్చి ఇస్తారని అన్నారు. జహీరాబాద్లో నిర్వహించిన జన ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. రైతుబంధుపై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రైతులకు ఇవ్వదని… ఇచ్చిన వారిని ఆపడమే తమ పని అని అన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ కు ఉన్న బంధం ఓట్ల బంధం కాదన్నారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినప్పటికీ రైతుబంధుకే ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం 11 సార్లు రైతు బంధు ఉత్సవాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఓట్ల కోసం కాదని, రైతులపై ప్రేమతో రైతుబంధు ఇస్తున్నారని అన్నారు.
Read also: PM Modi: కేసీఆర్ కలిసేందుకు వచ్చినా నేను కలవలేదు.. ఎందుకంటే..
Also Read
రైతుబంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 16వేలు కేసీఆర్ ఇస్తే… రైతుకు రూ. 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నారని, ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రైతుబంధు అంతం అవుతుందని కాంగ్రెస్ నేతలకు ఓట్లు వేయాలని అన్నారు. రైతుబంధుపై ఎన్నికల ప్రచార సభలో హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హరీశ్రావు స్పందించారు. ఇందులో ఏమైనా పొరపాట్లు వుందా అని ప్రశ్నించారు. సోమవారం ఉదయం టీ తాగితే రైతుబంధు నిధులు అందినట్లు ఫోన్లో నోటిఫికేషన్ వస్తుందని హరీశ్రావు తెలిపారు. ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రైతుబంధును తిరస్కరించింది. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందన్నారు. రైతన్న నోటికాడి ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. తాను తప్పేం మాట్లాడలేదని.. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని హరీష్ రావ్ క్లారిటీ ఇచ్చారు.
Ponguleti: కేసీఆర్ కలల్ని పగటి కలలు చేయాలి.. కాంగ్రెస్ ను ఆదరించాలి
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో