Liquor Smuggling Racket: గోవా మద్యం దందాపై ఎక్సైజ్ దాడులు.. 92 బాటిళ్లు, 3 కార్లు సీజ్.!
- గోవా లిక్కర్ అక్రమ రవాణా బండారం
- 92 బాటిళ్లు, 3 కార్లు సీజ్
- 15 మంది నిందితులు అరెస్ట్
- ఎక్సైజ్ STF మెరుపు దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Smuggling Racket: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై ఎక్సైజ్ శాఖ విరుచుకుపడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా గోవా, ఢిల్లీ, హర్యానా వంటి ప్రాంతాల నుండి నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ (NDPL)ను తరలిస్తున్న ముఠాలను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ (STF) బృందం పట్టుకుంది. ఎయిర్పోర్ట్ నుండి మద్యాన్ని కార్లలో నగరానికి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి నేతృత్వంలో పహాడీ షరీఫ్ వద్ద మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాలుగు వేర్వేరు బృందాలుగా విడిపోయిన అధికారులు మొత్తం 92 మద్యం బాటిళ్లను, మూడు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అదిరింది.. 36 వేలకే 5 Star 1.5 Ton AC.. Summer రాకముందే అదిరిపోయే Gift..!
Also Read
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
ఈ అక్రమ రవాణాకు సంబంధించి నాలుగు వేర్వేరు కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొదటి కేసులో 23 బాటిళ్లు , ఒక కారును స్వాధీనం చేసుకుని నలుగురిపై, రెండో కేసులో 34 బాటిళ్లు , ఒక కారును స్వాధీనం చేసుకుని ఐదుగురిపై, మూడో కేసులో 21 బాటిళ్లు , మరో కారును స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మరో 14 బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ , నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. తక్కువ ధరకు లభిస్తుందనే సాకుతో గోవా వంటి ప్రాంతాల నుండి విమానాల్లో మద్యాన్ని తెచ్చి, ఇక్కడ గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రియ ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణాపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి అనుమతి లేకుండా మద్యాన్ని తీసుకురావడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా ఎన్డీపీఎల్ (NDPL) మద్యాన్ని తరలిస్తూ పట్టుబడితే కేవలం మద్యం బాటిళ్లనే కాకుండా వారు ఉపయోగిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లను తరలిస్తే వ్యక్తులతో పాటు వాహనాలపై కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీ నుంచి మద్యం అక్రమ రవాణాపై నిఘా మరింత పెంచుతామని ఆమె తెలిపారు.
AI Dating Trend: ఏఐతో డేటింగ్.. న్యూయార్క్లో సంచలనం సృష్టిస్తున్న ఏఐ కేప్!
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?