Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్వాడీలకు హాఫ్ డే స్కూల్స్
- ఎండల తీవ్రతతో అంగన్వాడీలకు హాఫ్ డే విధానం
- ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు అమలు
- టేక్ హోం రేషన్ పంపిణీ యథావిధిగా కొనసాగింపు
- చిన్నారుల ఆరోగ్యం కోసం ప్రభుత్వ ముందస్తు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, చిన్నారుల ఆరోగ్యం , భద్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల సమయాలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది చిన్నారులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. ప్రస్తుతానికి ఈ ఒంటిపూట బడుల విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చిన్నపిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అంగన్వాడీ చరిత్రలోనే గత ఏడాది నుంచి ఈ ఒంటిపూట బడులు , వేసవి సెలవుల విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.
Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఈ ఏడాది కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సమయాలు మారినప్పటికీ, లబ్ధిదారులకు అందే పౌష్టికాహార పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ‘టేక్ హోం రేషన్’ (Take Home Ration) ద్వారా గర్భిణులు, బాలింతలు , చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారాన్ని యథావిధిగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. దీనివల్ల కేంద్రాలు త్వరగా మూసివేసినప్పటికీ, లబ్ధిదారులకు అందాల్సిన పోషకాలు నేరుగా వారి ఇళ్లకే చేరుతాయి. ఒంటిపూట బడుల గడువు ముగిసిన తర్వాత, నెల రోజుల పాటు ఇచ్చే వేసవి సెలవుల గురించి ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. చిన్నారుల క్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల పట్ల అంగన్వాడీ సిబ్బంది , తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Global Trade Crisis: ఇప్పటికే హర్మూజ్ మూసివేత.. మరో జలసంధి మూసివేతకు హౌతీల ప్లాన్..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!