రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, చిన్నారుల ఆరోగ్యం , భద్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల సమయాలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో వేలాది మంది చిన్నారులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించనుంది. ప్రస్తుతానికి ఈ ఒంటిపూట బడుల విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల చిన్నపిల్లలు వడదెబ్బకు…