TSPSC Group 1: గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Group 1: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని TSPSC తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 9న పరీక్ష నిర్వహించేందుకు జూన్ 1 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు వచ్చాయి. దీంతో గ్రూప్-1కి దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చిందని, నిరుద్యోగులదీ అదే పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు.
Read also: Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
ఎన్నికలకు సిద్ధం కాలేదని, ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు కనీసం రెండు నెలలపాటు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని అభ్యర్థించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. గ్రూప్-1 పరీక్షల పేరుతో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పట్టభద్రులకు ఓటు వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఈ వాస్తవాన్ని ఎన్నికల సంఘం గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు బిల్ నాగరాజు యాదవ్, నాగేంద్రరావు, అవినాష్, చిలుకల రాకేష్ తదితరులున్నారు.
Read also: Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో మొత్తం 536 ఖాళీల కోసం గ్రూప్ 1 స్థానాలకు రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 జూన్ 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో జరగనుంది, పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు TSPSC గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు ఫారమ్ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు తమ TSPSC గ్రూప్ 1 హాల్ టిక్కెట్ను పరీక్ష తేదీకి ముందు అధికారిక TSPSC వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ హాల్ టిక్కెట్ను డౌన్లోడ్ చేసి, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి, ఎందుకంటే ఇది పరీక్షకు కూర్చోవడానికి వారి అర్హతను ధృవీకరిస్తుంది.
Kavya Maran: కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్!
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!