TSPSC Group 1: గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు..
TSPSC Group 1: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని TSPSC తేల్చి చెప్పింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 9న పరీక్ష నిర్వహించేందుకు జూన్ 1 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎన్నికలు వచ్చాయి. దీంతో గ్రూప్-1కి దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇన్ సర్వీస్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చిందని, నిరుద్యోగులదీ అదే పరిస్థితి ఎదుర్కొన్నారన్నారు.
Read also: Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
Also Read
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
ఎన్నికలకు సిద్ధం కాలేదని, ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు కనీసం రెండు నెలలపాటు ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసి తమకు న్యాయం చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీని అభ్యర్థించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించామన్నారు. గ్రూప్-1 పరీక్షల పేరుతో గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో పట్టభద్రులకు ఓటు వేయకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఈ వాస్తవాన్ని ఎన్నికల సంఘం గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు బిల్ నాగరాజు యాదవ్, నాగేంద్రరావు, అవినాష్, చిలుకల రాకేష్ తదితరులున్నారు.
Read also: Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో మొత్తం 536 ఖాళీల కోసం గ్రూప్ 1 స్థానాలకు రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష 9 జూన్ 2024న రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో జరగనుంది, పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు TSPSC గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావచ్చు. దరఖాస్తు ఫారమ్ను విజయవంతంగా సమర్పించిన అభ్యర్థులు తమ TSPSC గ్రూప్ 1 హాల్ టిక్కెట్ను పరీక్ష తేదీకి ముందు అధికారిక TSPSC వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ హాల్ టిక్కెట్ను డౌన్లోడ్ చేసి, పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి, ఎందుకంటే ఇది పరీక్షకు కూర్చోవడానికి వారి అర్హతను ధృవీకరిస్తుంది.
Kavya Maran: కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్!
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో