Israel air strike in rafah: శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. కనీసం 35 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel air strike in rafah: గాజా తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలో పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఆదివారం, ఇజ్రాయెల్ దళాలు రఫాలోని శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించాయి. కనీసం 35 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మా బృందం హమాస్ శిబిరాలపై దాడి చేసిందని, ఇందులో వెస్ట్ బ్యాంక్లోని హమాస్ కమాండర్తో సహా చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఐడీఎఫ్ తెలిపింది. మరోవైపు, 15 రోజుల క్రితం దాడుల నుండి తప్పించుకోవడానికి సాధారణ ప్రజలు ఆశ్రయం పొందిన ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్లు హమాస్ పేర్కొంది.
హమాస్ వాదనలకు విరుద్ధంగా, రఫాలో తన మొదటి ప్రధాన ఆపరేషన్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ విభాగం అధిపతి యాసిన్ రబియా, దాని వెస్ట్ బ్యాంక్ డివిజన్ కమాండర్ ఖలీద్ నగర్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. గాజా స్ట్రిప్ నుండి ప్రాణాల కోసం రఫాకు పారిపోయిన నిరాశ్రయులపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయని దక్షిణ గాజాలోని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో కనీసం 35 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ దాడిని హమాస్ జాతి నిర్మూలనగా అభివర్ణించింది. ఇజ్రాయెల్ బలగాల దాడి చాలా క్రూరమైనదని, నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, సహాయ శిబిరాలను బాంబులతో పేల్చివేశారని దాడి అనంతరం హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. గుడారం, దాని లోపల పడి ఉన్న మృతదేహాలు అగ్ని వర్షంలో కరిగి కాలిపోతున్నాయి. ఇజ్రాయెల్ అమాయకులను చంపేస్తోందని హమాస్ ఆరోపించింది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also:Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
ఒకవైపు హమాస్ ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేసి ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ బలగాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాల నుండి తప్పించుకుని 15 రోజుల క్రితం పౌరులు గుడారాలు, శిబిరాల్లో ఆశ్రయం పొందిన పశ్చిమ రఫాలోని ఆ ప్రాంతాలలో దాడులు జరిగాయని పాలస్తీనా ఆరోగ్య , పౌర అత్యవసర సేవా అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో గాయపడిన వారిని అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ నిర్వహిస్తున్న రఫాలోని ఫీల్డ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం మృతుల సంఖ్య కచ్చితమైనది కానప్పటికీ క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
హమాస్ సీనియర్ అధికారి ఒకరు దాడికి ఇజ్రాయెల్, యుఎస్ రెండింటినీ నిందించారు. ఇది మారణహోమం అని ఆరోపించారు. అమెరికా ఆయుధాల సాయంతో ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు రఫాలో నరమేధానికి పాల్పడుతోందని అంటున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ ఒక ఆసుపత్రి ఉద్యోగిని ఉటంకిస్తూ, “వైమానిక దాడులు డేరాలను తగలబెట్టాయి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది, టెంట్లు కరిగిపోతున్నాయి. ప్రజల శరీరాలు కూడా కాలిపోతున్నాయి.” అన్నారు.
Read Also:America : అమెరికాను వణికించిన సుడిగాలి.. అనేక రాష్ట్రాల్లో విధ్వంసం.. 11 మంది మృతి
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!