Bandi Sanjay: బండి సంజయ్ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు..
- గ్రూప్-1 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా చూడాలి..
- గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం..
- నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం..
- నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బండి సంజయ్ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా నిరుద్యోగులు కోరుతున్నారు. నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని నిరుద్యోగులు గుర్తు చేశారు. మెయిన్స్ కు 1:50 చొప్పున ఎంపిక చేయడం వల్ల గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడంపై తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.
Read also: Minister Kondapalli Srinivas: బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్.. చిన్న పరిశ్రమలకు రాయితీలు
Also Read
నిరుద్యోగులు గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడంతో 1:50 చొప్పున మెయిన్స్ కు ఎంపికైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన 1:75 అభ్యర్థులను గుర్తు చేశారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మెయిన్స్కు 1:100 ఎంపిక చేసిందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే నిరుద్యోగులు పెద్దఎత్తున ధర్నా చేపడతామన్నారు. నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని ఎన్నికల్లో బండి సంజయ్ ఇచ్చిన హామీ మేరకు మెయిన్స్కు 1:100 ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాగా.. తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించి.. సంబంధిత ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా విడుదల చేశారు.
Bike Thieves: పార్క్ చేసిన వాహనాలే టార్గెట్.. సీసీ కెమెరాలో దృశ్యాలు
తాజావార్తలు
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!