Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
గోదావరి నదిలో ఒక్కసారిగా వరద విరుచుకుపడింది.. భద్రాచలం దగ్గర ఏకంగా 70 అడుగులను దాటేసింది.. ఇక, కడియం ప్రాజెక్టు ఉంటుందా..? ఊడిపోతుందా? అనే టెన్షన్ కూడా పెట్టింది.. అయితే, ఈ నేపథ్యంలో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. భారీ వర్షాలు, వరదలపై స్పందిస్తూ.. దీని వెనుక విదేశాల కుట్ర ఏమైనా ఉందోమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు.. ఇప్పటికే లద్దాఖ్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ చేశారని.. ఇప్పుడు గోదావరి ప్రాంతంలోనూ అదే జరిగి ఉంటుందేమో.. దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉందన్నారు.. అయితే, యానాం పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. క్లౌడ్ బరస్ట్పై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పుడు వచ్చిన వరదలు క్లౌడ్ బరస్ట్ కాదని తేల్చేసిన ఆమె.. ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే, కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వరదలొచ్చాయని తెలిపారు.
Read Also: Minister Harish Rao: మోదీజీ.. పేదలు ఏం పాపం చేశారు?
Also Read
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
యానాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన తమిళిసై… 15వ తేదీన వరదలపై రివ్యూ నిర్వహించాం.. అనుకోకుండా వరదలు ముందుగానే వచ్చాయని తెలిపారు.. ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము… 25 కేజీల బియ్యం ప్రభుత్వం ఇస్తుంది.. ప్రతి బాధితుడిని అన్ని విధాలా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆదుకుంటున్నాం.. వైద్యం విషయంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.. ఇక, ఆంధ్ర ప్రాంతానికి ఇబ్బందులు లేకుండా యానాం రక్షణ వాల్ నిర్మాణం కోసం డిజైన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. రక్షణ వాల్ నిర్మాణానికి 137 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ ప్రకటించిందని తెలిపారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై. అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై ఆమె స్పందించడం.. ఆయనకు కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది.
ఇక, ఈ వ్యవహారంలో సమాచారం ఉంటే ఇవ్వండి.. ఎలాంటి విచారణ జరిపించడానికైనా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.. క్లౌడ్ బరస్ట్పై అంతర్జాతీయ కుట్ర సమాచారం ఉంటే ఇవ్వండన్న ఆయన.. ఇప్పటి వరకు ఒక దేశంలో మరో దేశం క్లౌడ్ బరస్ట్ చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.. లద్దాఖ్, ఉత్తరాఖండ్లో అలా జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు, దానికి సంబంధించిన సమాచారం ఉంటే ఇవ్వాలి, ఏ దేశాలు, సంస్థలు కుట్రలు చేశాయో పూర్తి స్థాయిలో విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
-
Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!