Tamilisai: సెక్రెటేరియట్ ఓపెనింగ్కి పిలవలేదు.. గవర్నర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai Fires On BRS Govt For Not Inviting Secretariat Opening: ఫస్ట్ సిటిజన్గా తనను సెక్రటేరియట్ ఓపెనింగ్కి పిలవలేదని.. ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరంగా ఉంటున్నాయని గవర్నర్ తమిళిసై మండిపడ్డారు. దేశాల అధినేతలను మనం కలవచ్చు.. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని విమర్శించారు. గచ్చిబౌలి రాడిసన్లో నిర్వహించిన జీ20లో భాగంగా సీ20 సమాజ్ శాల కార్యక్రమానికి తమిళిసై ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన భారతదేశం అన్ని రంగాల్లోనూ ప్రపంచానికి సొల్యూషన్ ఇస్తోందన్నారు. కేవలం మాటల్లో చెప్పడం కాదని, అన్ని చేతల్లో చేసి చూపించబడ్డాయని అన్నారు. కోవిడ్ టైంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. ఇండియాలో కొవిడ్తో 45లక్షల మంది చనిపోతారని ఇతర దేశాలయన్నాయని.. కానీ అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి మనం వారిని కాపాడామని అన్నారు. అయితే.. కొందరు చేసే పనిని మాత్రం వ్యతిరేకిస్తుంటారని కౌంటర్లు వేశారు.
Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
Also Read
కొవిడ్ టైంలో తెలంగాణలో డాక్టర్లు కూడా వైరస్ భారిన పడ్డారని, తానూ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూశానని తమిళిసై చెప్పారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మనం ఎన్నో సాధించామని అన్నారు. కేవలం ప్రేమతోనే మనమంతా కొవిడ్ నుంచి ధైర్యంగా కోలుకోగలిగామన్నారు. మోడీ నేతృత్వంలో మనం ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. నంబర్ వన్ ఎకనామిక్ పవర్గా ఇండియా మారుతోందని ఉద్ఘాటించారు. జీ20 ద్వారా ప్రపంచానికి ఇండియా లీడర్గా నిలుస్తుందన్నారు. కానీ.. కొంతమంది కేవలం మాట్లాడుతారే తప్ప, పని చేయరంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. స్వామి వివేకానంద ఏం చెప్పారో.. ఇప్పుడు అవన్నీ మోడి చేస్తున్నారని తెలిపారు. అందరం ప్రజల కోసమే ఉన్నామని, అందుకు తగ్గట్టు పని చేయాలని సూచించారు. అభివృద్ధి అంటే కేవలం ఒక్క ఫ్యామిలీ కోసం కాదని, అందరూ డెవలప్ అవ్వాలని అన్నారు. నాయకులు, అధికారులు, రాజ్ భవన్, అందరూ కూడా ప్రజల కోసమే ఉన్నామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!