Gadwal Vijayalakshmi: కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్న మేయర్.. పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Vijayalakshmi: లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశరావు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న రేవంత్ రెడ్డిని కలిశారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభమైందని, నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ లోనే ఉన్నానని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరనున్నారు.
Read also: Lanka Dinakar: రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే.. కాదని చెప్పే ధైర్యం ఉందా?
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈరోజు కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాస్ మున్షీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరడంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారు. పురాణం సతీష్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం స్తంభించిపోయిందన్నారు. బిఆర్ఎస్ ఇంతకాలం బానిస సంకెళ్లలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రిలోనూ 400 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని కొనియాడారు. ఆరు హామీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లని చేశారని విమర్శించారు.
Bharat Ratna : భారతరత్న అవార్డు అందుకున్న పీవీ తనయుడు ప్రభాకర్ రావు
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?