Stray Dogs: ఇదే పని ముందే చేసి ఉంటే.. అంబర్ పేట చిన్నారి ప్రాణాలు దక్కేవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stray dogs: సంతోష్ నగర్ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై వీది కుక్క దాడి ఘటనతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో కుక్కలను పట్టుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఉదయం నుంచి సంతోష్ నగర్ పరిసరాల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.. వీధి కుక్కల పరుగెడుతుంటే వాటి వెంటపడి పట్టుకుంటున్నారు. కుక్కల కోసం అన్నీ వీధులు, కాలనీల్లో తిరుగుతున్నారు. వారిని చూసి వీధి కుక్కలు పారిపోతున్నాయి
అటు మనుషులపై కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న సంతోష్ నగర్.వారం క్రితం కాంచన్ బాగ్. అంతకు ముందు అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతితో పాటు పలు ఘటనలు చోటు చేసుకున్నాయి.సంతోష్ నగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల పిల్లాడు అబ్దుల్ రఫె వీధి కుక్క దాడి చేసింది. పిల్లాడు కేకలు వెయ్యడంతో.. ఆ అరుపులు విన్న స్థానికులు.. పిల్లాణ్ని కాపాడారు. అప్పటికే ఆ కుక్కలు.. పిల్లాడి కాళ్ళు. వీపు, చేతిని విచక్షణా రహితంగా దాడి చేశాయి. దీంతో కుటుంభ సభ్యులు పరుగున ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల దాడిలో రోజుకో చిన్నారులు గురవుతునే వున్నారు. చిన్న పిల్లల్ని వీధిలో వదలాలంటేనే తల్లిదండ్రులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు.
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
చిన్నారులపైనే కాకుండా పెద్దలపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. అటు చిన్నారు, ఇటు పెద్దవారు అనే తేడాలేండా శరీరాలను పీక్కుతుంటున్నాయి. కొందరు బతికి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుంటుంటే మరి కొందరు కుక్కల దాడికి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనలో ఎక్కువ చిన్నారులే కావడం గమనార్హం. మొత్తంగా నగరంలో ఈ వీధి కుక్కల సమస్య తలనొప్పిగా మారింది. ఇక దీంతో జీహెచ్ ఎంసీ అలర్ట్ అయ్యింది. ఇప్పుడు అధికారులు కుక్కల కోసం పరుగులు పెడుతున్నారు. గల్లీ గల్లీ లో వెళ్లి వీధికుక్కలను బంధిస్తూ తరలిస్తున్నారు. ఎక్కడ వీధి కుక్కలు కనపడినా పరుగులు పెడుతూ వాటిని బంధిస్తున్నారు. అయితే జీహెచ్ ఎంసీ చేస్తున్న పనికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే పని ఇంతకుముందే చేసి ఉంటే.. అంబర్ పేటలో చిన్నారి ప్రాణాలు దక్కేవే అంటున్నారు. అంతా అయిపోయాక.. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అని కొందరు విమర్శిస్తుంటే.. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచారని మరికొందరు అంటున్నారు. ఎట్టకేలకు జీహెచ్ ఎంసీ ఇప్పటికైనా స్పందించిందని అంటున్నారు. ఇదేమని ముందే చేసి ఉంటే ఇప్పటి వరకు కుక్కల దాడికి బలైన వారి సంఖ్య ఉండేది కాదని చెబుతున్నారు.
Minister Harish rao: సిద్దిపేటలో రైలు కూత వినిపించాలని.. అధికారులకు మంత్రి ఆదేశం
తాజావార్తలు
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
-
Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!