Garikapati Narasimha Rao: చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే.. నేను వెళ్లిపోతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garikapati Narasimha Rao Got Furious Over Chiranjeevi Photo Session In Alai Balai: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ‘అలయ్ బలయ్’ వేడుకల్లో ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. తాను ప్రసంగిస్తున్న సమయంలోనే.. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ఫోటో సెషన్ ప్రారంభమైంది. దీంతో అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. కెమెరామెన్లు, ఫోటో దిగాలనుకున్న అభిమానులందరూ.. చిరుని చుట్టుముట్టేశారు. ఈ పరిణామంతో కాస్త ఆగ్రహానికి లోనైన గరికపాటి.. ‘అటువైపు జరుగుతున్న ఫోటో సెషన్ని ఆపేయాలి, లేకపోతే నేను వెళ్లిపోతాన’ని అన్నారు. అనంతరం.. ‘చిరంజీవి, దయచేసి అక్కడ మీరు ఫోటో సెషన్ ఆపేసి ఇటువైపుకి రండి, నేను ప్రసంగాన్ని కొనసాగిస్తాను’ అని చెప్పారు. అనంతరం సిబ్బంది వచ్చి అటువైపుగా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయగా, తన ప్రసంగాన్ని ఆపేసి గరికపాటి చిరు ఫోటోసెషన్ వైపుకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలో చిరు తన ఫోటోసెషన్ ఆపేసి, ఆయన పక్కన కూర్చున్నారు. అప్పుడు మళ్లీ తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు గరికపాటి. అయితే.. ఈ వ్యవహారంలో గరికపాటి నొచ్చుకోకుండా, చాలా కూల్గా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
ఇదిలావుండగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ అలయ్ బలయ్ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి డోలు వాయిస్తూ హాజరయ్యారు. మెడలో డోలు వేసుకుని.. ఉత్సాహంగా డోలు వాయించిన ఆయన, స్టెప్పులు కూడా వేశారు. పక్కనే ఉన్న బండారు దత్తాత్రేయ కూడా.. చిరుతో పాటు డోలు వాయిస్తూ, స్టెప్పులేశారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, గరికపాటి నరసింహారావు, భాజపా నేతలు వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సినీ నటుడు బాబూమోహన్, ఎమ్మెల్యే రఘునందనరావు, సంగీత దర్శకురాలు శ్రీలేఖ తదితరులు హాజరయ్యారు.
Also Read
- Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
- Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
- Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
- Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
చిరంజీవి గారు మీ ఫోటో సెషన్ ఆపితే నేను మాట్లాడాలి – ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు#GarikapatiNarasimhaRao #Chiranjeevi #MegastarChiranjeevi #AlaiBalai #Nampally #Hyderabad #NTVTelugu pic.twitter.com/X0Av64Jufj
— NTV Telugu (@NtvTeluguLive) October 6, 2022
తాజావార్తలు
-
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
-
Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
-
Harbhajan Singh: వారి త్యాగాలు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు.. భావోద్వేగానికి గురైన హర్భజన్ సింగ్..
-
Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
-
RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!