యాసంగిలో పండించిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక్కొక్క కోనుగోలు కేంద్రాలు దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో 36 లక్షలు ఎకరాలలో సాగు జరిగిందని, 65 లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.
15 కోట్లు గన్ని బ్యాగ్ లు అవసరం అవుతాయని, మన దగ్గర కోటి 60 లక్షల గన్ని బ్యాగులు ఉన్నాయన్నారు. జూట్ కమిషన్ ఆఫ్ ఇండియాకి గన్ని బ్యాగులు కోసం ఆడిగామని, అవి ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర కొనడానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏడూ కోట్ల 50 లక్షలు కొత్త గన్ని బ్యాగులు కావాలి, 527 కోట్లు డీ డీ ఇవ్వాలన్నారు. ఫుడ్ కార్పోరేషన్ ఇండియా దగ్గరే ఎక్కువ గొడౌన్ లు ఉన్నాయని, 1,960 కంటే ఒక్క రూపాయి తక్కువ ఎవరు ధాన్యాన్ని అమ్ముకోవద్దన ఆయన పేర్కొన్నారు.
Bandi Sanjay : కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి