Siddipet Food Poison: చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. అస్వస్థతకు గురైన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లా లోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. పలు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఆసుపత్రి పాలయ్యారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. అయితే మిగిలిన చికెన్ గ్రేవీని వంకాయ కూరలో కలిపి రాత్రి విద్యార్థులకు వడ్డించారు. ఏదో ఒకటి వడ్డించేస్తే ఈరోజు రాత్రికి పని అయిపోతుందిలే అనుకున్న పాఠశాల యాజమాన్యానికి దిమ్మతిరిగింది. విద్యార్థులకు అర్థరాత్రి నుంచే వాలికలు అస్వస్థతకు గురై.. వాంతులు, విరేచనాలు చేకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అయినా యాజమాన్యం నిమ్మకు నీరత్తకుండా వుండిపోయింది. దీంతో బాలికలకు సోమవారం నాటికి కడుపు నొప్పి తీవ్రం మైంది. దీంతో పాఠశాల సిబ్బంది వైద్యులను పిలిపించి స్కూల్ లోనే పిల్లలకు వైద్యం అందించారు. ఈవిషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలకు వైద్యం అందించినా సోమవారం మధ్నాహ్నం నుంచి పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరిగినా ఎటువంటి సమాచారం అందించకుండా రహస్యంగా వైద్యం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
అయితే.. ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. అస్వస్తతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ ని , పిల్లలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు డాక్టర్లు పర్యవేక్షణ చేయాలని మంత్రి హరీష్ ఆదేశించారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని , విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి హరీశ్ రావు ధైర్యం చెప్పారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!