Siddipet Food Poison: చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. అస్వస్థతకు గురైన విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లా లోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యం విద్యార్థినుల ప్రాణాల మీదకు తెచ్చింది. పలు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో.. ఆసుపత్రి పాలయ్యారు. నిన్న (ఆదివారం) మధ్యాహ్నం విద్యార్థులకు చికెన్ తో భోజనం వడ్డించారు. అయితే మిగిలిన చికెన్ గ్రేవీని వంకాయ కూరలో కలిపి రాత్రి విద్యార్థులకు వడ్డించారు. ఏదో ఒకటి వడ్డించేస్తే ఈరోజు రాత్రికి పని అయిపోతుందిలే అనుకున్న పాఠశాల యాజమాన్యానికి దిమ్మతిరిగింది. విద్యార్థులకు అర్థరాత్రి నుంచే వాలికలు అస్వస్థతకు గురై.. వాంతులు, విరేచనాలు చేకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
అయినా యాజమాన్యం నిమ్మకు నీరత్తకుండా వుండిపోయింది. దీంతో బాలికలకు సోమవారం నాటికి కడుపు నొప్పి తీవ్రం మైంది. దీంతో పాఠశాల సిబ్బంది వైద్యులను పిలిపించి స్కూల్ లోనే పిల్లలకు వైద్యం అందించారు. ఈవిషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లలకు వైద్యం అందించినా సోమవారం మధ్నాహ్నం నుంచి పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరిగినా ఎటువంటి సమాచారం అందించకుండా రహస్యంగా వైద్యం అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
అయితే.. ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. అస్వస్తతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ ని , పిల్లలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు డాక్టర్లు పర్యవేక్షణ చేయాలని మంత్రి హరీష్ ఆదేశించారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని , విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి హరీశ్ రావు ధైర్యం చెప్పారు.
తాజావార్తలు
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!