Firing Case Update: రెండు బుల్లెట్లు, అనుమానితుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇబ్రహీం పట్నంలో సంచలనం కలిగించిన కాల్పుల ఘటనలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో రెండు లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి ఎక్కడి నుంచి తెచ్చారనేది ఆరాతీస్తున్నారు. కారులో రెండు క్యాట్రిడ్జీలను స్వాధీనం చేసుకుంది క్లూస్ టీమ్.
శ్రీనివాస్ రెడ్డిని షాట్ వెపన్ తో, రాఘవేంద్ర రెడ్డి పై తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. రాఘవేందర్ రెడ్డి మృతదేహం నుండి బుల్లెట్ ను తీసి పోలీసులకు అందజేశారు వైద్యులు. శ్రీనివాస్ రెడ్డి తల నుండి దూసుకెళ్లింది బుల్లెట్. శ్రీనివాస్ రెడ్డిని పాయింట్ బ్లాక్లో కాల్చి చంపారు దుండగులు. మట్టా రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న కృష్ణ, హఫీజ్ లతో పాటు పలువురిని విచారిస్తున్నారు పోలీసులు. మట్టా రెడ్డి పైనే అనుమానం వ్యక్తం చేశారు డ్రైవర్ కృష్ణ, హఫీజ్ లు. రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్పుల్లో మరణించిన వారి సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తుంది దర్యాప్తు టీమ్. అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేటను ముమ్మరం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!