Bandi Sanjay: రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం.. మా గ్రాఫ్ తగ్గినట్లు తప్పుడు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఆదిలాబాద్ వేదికగా అమిత్ షా బహిరంగ సభకు విపరీతమైన స్పందన వచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. మా గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మేము రాజకీయంగా కొట్లాడుతాం అంతే గానీ.. కేసీఆర్ బాగుండాలని కోరారు. నిజాంకు వ్యతిరేకంగా వచ్చే రజాకార్ సినిమా అంటే మీకు భయమెందుకు? అని ప్రశ్నించారు. మీరు నిజాం, రజాకార్ల వారసులా? ఎంఐఎం బాధపడుతుందని మీరెందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి 50 ఏళ్లకు మెచ్యురిటీ వస్తే పెళ్లెప్పుడు పిల్లలెెపుడు? అంటూ వ్యంగాస్త్రం వేశారు. వారంటీ లేని పార్టీ గ్యారెంటి ఇస్తే ఎవరు నమ్ముతారని అన్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అభివృద్ధి చేస్తుందన్నారు. కరీంనగర్ లో పోటీ చేయాలనుందని నా కోరిక చెప్పాను. మా అధిష్టానం ఆదేశిస్తే చేస్తా అని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్న అమిత్ షా కామెంట్స్ నిజం కాదా?? అని అన్నారు. మీరిద్దరూ ఒకటి కాకపోతే ఎంఐఎంకు దమ్ముంటే.. మీరు అల్లాను ప్రార్థిస్తే.. హైదరాబాద్ దాటి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా ఎందుకు మార్చడం లేదన్నది చెప్పాలన్నారు. జనసేనతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుంది. మాకున్న సమాచారం ప్రకారం మేము ఒంటరిగానే వెళ్తామన్నారు. ఎంఐఎం అడ్డాగా చెప్పుకునే భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు అన్ని పార్టీలను రప్పించిన ఘనత మాదన్నారు. చివరకు ఎంఐఎం నేతలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం పేరు కలవరిస్తున్నారని అన్నారు బండిసంజయ్.
గ్రామాల్లో పేద ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సొమ్ము ఒక్కరిది సోకు ఒక్కరిది అంటూ మండిపడ్డారు. గ్రామాల్లో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గొనె సంచి పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రోకరిజం చేస్తుందన్నారు. ఉపాధి హామీ పైసలు కూడా కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలు కేంద్రమే ఇస్తుందని, పంట నష్ట పోయిన రైతులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని మండిపడ్డారు. యువతను గంజాయికి అలవాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్ తో అడ్డుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ కబ్జాలు తట్టుకోలేక కష్టాల్లో ఉన్నారని అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం వస్తుందన్నారు. కొంత మంది అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం కార్యాలయంలో పదవి విరమణ పొందిన అధికారులతో ఎలా పనిచేస్తున్నారు? అని ప్రశ్నించారు. సీట్లు ప్రకటించిన బిఆర్ఎస్ ఏ టికెట్ గ్యారెంటీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సర్వేలు కూడా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే అప్పుల తెలంగాణగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. ముఖ్యమంత్రి సతీమణి తిరుమలలో పూజలు చేస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ ఎందుకు పూజలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు.. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి తప్పదు అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Big boss 7Telugu : అర్జున్ అంబటి ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!