Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం.. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Tragedy: కరీంనగర్ లో విషాదం జరిగింది. ఈతకు వెళ్లి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామంలో చాడ రంగారెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. చాడ రంగారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చాడ రంగారెడ్డి గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి 8 వ తరగతి,చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి 4వ తరగతి చదువుతున్నారు. అయితే ఎండులు మండుతుండటంతో కుమారులిద్దరిని తీసుకుని లోయర్ మానేరు జలశయానికి తండ్రి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరు కొడుకులను తీసుకుని ఈత కోసం నీటిలో దిగాడు. అయితే కాసేపు బాగానే ఇద్దరి పిల్లలతో నీటిలో ఆడుతూ గడిపిన తండ్రికి ఇంతలోనే చిన్నకొడుకు చిన్న కుమారుడు ఓమ్ జయ్ చైతన్య ఆనంద రెడ్డి నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు. అక్కడే వున్న తండ్రి రంగారెడ్డి చిన్న కొడుకును కాపాడేందుకు వెళ్లాడు. అయితే కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి, కొడుకులు ఇద్దరు నీటిలో మునిగిపోయారు.
Read also: Gangs of Godavari: విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీజర్కు ముహూర్తం ఖరారు!
Also Read
అక్కడే వున్న పెద్ద కుమారుడు కుమార్ జయ కౌసిక్ రెడ్డి భయంతో ఈత కొడుతూ గడ్డవద్దకు చేరుకున్నాడు. నాన్న, తమ్ముడు అంటూ గట్టిగా కేకలు వేసినా అక్కడ పరిసర ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో కాపాడేందుకు ఎవరు రాలేదు. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తన కళ్ల ఎదుట తండ్రి, తమ్ముడు ప్రాణాలు కోల్పోతున్న కాపాడేలేక నిస్సాహాయ స్థితిలో పెద్ద కుమారుడు కౌసిక్ ఉండిపోయాడు. ఇక చేసేది ఏమీలేక కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలిపాడు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన లోయర్ మానేరు వద్దకు చేరుకున్నారు. జలాశయంలో ఇద్దరు తండ్రి, కొడుకు విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Metro: రేపు ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో, బస్సు సేవలు పొడిగింపు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?