వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత..రైతులతో కొలిక్కి రాని చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా.. రైతులు శాంతించారు. కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
Read Also: హైకోర్టుకు హాజరు కాని ఉద్యోగ సంఘాల నేతలు
Also Read
రైతులకు న్యాయం చేయాలని కోరారు.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతుల ఆందోళన విరమింపజేశారు. తర్వాత వారితో చర్చలు జరిపారు. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులు కాంటాలను అడ్డుకున్నారు. డీసీఎం వ్యాన్ అద్దాలు పగలకొట్టారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గిట్టుబాటు ధర వచ్చేవరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు శాంతింప జేసిన రైతులు మాత్రం తమ ఆందోళనలు విరమించడం లేదు.
తాజావార్తలు
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి