Telangana Farmers: అధికారుల నిర్లక్ష్యంతో పంట నేల పాలైంది.. మొలకెత్తిన ధాన్యంతో రైతన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Farmers: అకాల వర్షాలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ధాన్యాన్ని సాయంత్రం ఆరబెట్టి మళ్లీ కుప్పలుగా పెడుతున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు. చేతికి వచ్చిన పంట వర్షాధారం కావడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వరి కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి వచ్చి 20 రోజులు గడుస్తున్నా సరైన సమయంలో రైతుల నుంచి వసూలు చేయకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలు, లారీల కొరత ఉందన్నారు. మరోవైపు తెల్లవారుజామున ఎండలు, సాయంత్రం నాలుగు గంటల నుంచి వారం రోజులుగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వరి పూర్తిగా తడిసి మొలకెత్తింది.
Read also: Rave Party : బెంగళూరులో రేవ్పార్టీ.. పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులు
Also Read
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
దీంతో కష్టానికి నీరు అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిన్న పలు మండలాలతో పాటు గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసిన ధాన్యం నీట మునిగింది. వరి కొనుగోలు కేంద్రాలు చెరువులుగా మారాయి. దీంతో అన్నదాతలు బియ్యం ధాన్యాన్ని కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వరి ధాన్యం కొట్టుకుపోతుంటే ఏం చేయలేమని రైతులు వాపోయారు. మరోవైపు మెదక్ జిల్లాలో గత నాలుగు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నారు. కల్లాల కింద నీళ్లు చేరడంతో వరిధాన్యం మొలకెత్తుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులవుతున్న అధికారులు కొనడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట నేల పాలవుతుందని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. తేమ శాతం, హమాలి, లారీల కొరత అంటూ అధికారులు కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
Rains Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..!
తాజావార్తలు
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
-
Dragon : గ్లిమ్స్ కోసం మూడు రోజులుగా వర్క్ చేస్తున్న రవి బస్రూర్