Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Farmers Are Worried About Crops That Are Submerged In Rain

Farmers worried: వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు

Published Date :March 17, 2023 , 10:47 am
By NTV WebDesk
Farmers worried: వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Farmers worried: తెలంగాణలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ద్రోణి ప్రభావంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు రైతన్నల్లు లబోదిబో మంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన వేరుశనగ, కల్లాల్లో మిర్చి పంటల అకాల వర్షాలకు తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇలా పంటలు తడవడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లో పంటలు తడిస్తే ఎవరు కొనుగోలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రెండు రోజుల పాటు వానలు పడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు.

జగిత్యాల..

Also Read

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
  • Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!

జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ చౌరస్తా, ధరూర్ క్యాంప్, విద్యానగర్ , ఉస్మాన్ పుర,ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాయికల్ , సారంగాపూర్ , బీర్పూర్ పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొడిమ్యల మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది.

సంగారెడ్డి..

సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మునిపల్లిలో మామిడి రాలిపోయింది. న్యాల్ కల్ లో వడగండ్లకి పుచ్చకాయ పంట ధ్వంసం అయ్యింది. మళ్ళీ వర్షం వస్తుండటంతో అన్నదాతలు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. వానలకు పలు గ్రామాల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మహబూబ్ నగర్

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఐజ, మానవపాడు మండలాల్లో కల్లాల లోని మిర్చి తడిసి ముద్దైంది.దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక గద్వాల మార్కెట్ యార్డ్ లో వర్షపు నీటికి అమ్మకానికి తెచ్చిన వేరుశనగ కొట్టుకుపోవడంతో రైతన్నలు లబోదిబో మంటున్నారు.

మెదక్..

ఉమ్మడి మెదక్ జిల్లాలో వాన ముసురుకుంది. చాలా చోట్ల ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్నటి వడగళ్ల వానతో చాలా చోట్ల పంటలు పాడై పోయాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకున్నారు. అప్పులు చేసి పంటలు వేశామని ఇప్పుడు ఆకాల వర్షాలకు పంటలు దబ్బుతిని, నీట మునిగాయంటూ.. వాపోతున్నారు.

నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో.. నేడు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించింది. జిల్లాలోని ఆర్ముర్,బాల్కొండ మెండోరా,వేల్పూర్ ముప్కాల్, మండలాల్లో మొక్క జొన్న తడిసి పోయింది. వర్ష సూచనతో పసుపు కొనుగోళ్లు నిలిపి వేశారు అధికారులు. దీంతో.. వరుస సెలవులతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్..

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో ట్రాక్టర్ల పై విరిగిపడ్డ చెట్లు రెండు ట్రాక్టర్ల ఇంజన్లు ద్వంసమయ్యాయి. మండలంలోని మాదాపూర్ గ్రామంలో అకాల వర్షానికి మొక్కజొన్న పంట నెలకొరిగింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad Farmers
  • Farmers
  • Farmers are worried about rain
  • jagityala Farmers
  • medak Farmers

తాజావార్తలు

  • Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్‌పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్

  • Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions