MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఉత్కంఠగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తెల్లవారు జామున ఫలితాలను అధికారులు వెల్లడించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మొదటినుంచి వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి ముందంజలో కనిపించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి చాలా బలమైన పోటీ ఇచ్చారు. భారీ అంచనాలు ఉన్న పిడిఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి మూడవ స్థానానికి పరిమితమయ్యారు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి సగం కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి రామచంద్రారెడ్డికి మెజారిటీ వచ్చింది. సుమారు 450ఓట్ల వరకు రామచంద్రారెడ్డి ఆదిక్యం లో ఉన్నారు.
Also Read : Ram Charan: ఇండియా తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్… సాయంత్రం మోదీతో మీటింగ్
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనను విజయం సాధించినట్లు ప్రకటించనున్న నేపథ్యంలో వంటేరు శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడవ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది చివరకు మూడవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ ఓట్ల లెక్కింపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది చివరకు 169 ఓట్లతో వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతుదారుల్లో సంబరాలు మిన్నంటాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఫలితం వెలువడింది. అప్పటికే భారీగా వేచి ఉన్న అభిమానులు మద్దతుదారులు ఆయనకు పూలమాలలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారన్నది కేవలం అసత్యం మాత్రమేనని ఇది తన విజయం ద్వారా నిరూపితమైందన్నారు. కచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. సిట్టింగ్ పిడిఎఫ్ అభ్యర్థి కత్తినరసింహారెడ్డి మూడో స్థానంలో నిలిచాడు.మరో వ్తెపు పెద్ద మొత్తంలో నగదు పంపిణీతో పాటు ప్త్రెవేట్ టీచర్స్ ను ఓటర్లు చేర్పించడం వల్లే రామచంద్రారెడ్డి గెలుపుసాధించారని పిడిఎఫ్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read : RRR: జగజ్జేత ఇండియాకి తిరిగొచ్చాడు…
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!