Fake Certificates: భారీసంఖ్యలో ఫేక్ సర్టిఫికెట్లు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులుంటే చాలు.. కాలేజీకి వెళ్లక్కర్లేదు. కష్టపడి పరీక్షలు రాయాల్సిన పనిలేదు. మీకే యూనివర్శిటీ సర్టిఫికెట్ కావాలంటే అది మీ ఇంటికే వచ్చి చేరుతుంది. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం రచ్చరేపుతోంది. నకిలీ సర్తిఫికెట్లు సృష్టిస్తున్న వారితో పాటు నకిలి సర్టిఫికేట్లు కొన్నవారిని ..8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి భారి సంఖ్యలొ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.
సంతోష్ నగర్ కి చెందిన సయ్యద్ నవీద్ ఉరఫ్ ఫైసల్, యాదగిరి థియేటర్ సమిపంలో ఎం.హెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీస్ తెరిచాడు. ఆర్ధికంగా ఎదగలేకపోయాడు. ఆ కార్యాలయాని అక్కడే ఆపి, బషీర్ బాగ్ ప్రాంతం లొ క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ సర్విస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నూతనంగా ఆఫీసు తెరిచాడు. విదేశాలకు వెళ్లి విద్యాభ్యాసం చేయాలనుకునేవారిని టార్గెట్ చేశాడు. వీసాతో పాటు అత్యధిక ర్యాంకుతో పాటు మంచి మార్కులు ఉన్న సర్టిఫికెట్లు తయారు చేయించాడు. బాగా డబ్బు సంపాదించాలన్న దురాశతో మీర్ చౌక్, మీరాలం మండికి చెందిన డీటీపీ వర్కులో ప్రావీణ్యం ఉన్న సయ్యద్ నవీద్ తో పాటు, జమాల్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్రార్ ఉద్దీన్ తో జతకట్టాడు.
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ఈ ముగ్గురు నకిలీ సర్టిఫికెట్ల తయారీలో సహాయపడ్డారు. తక్కువ మార్కు ఉన్న వాటి పై ఎక్కువ మార్కులుగా, ఫెయిల్ అయిన వారి సర్టిఫికెట్లను పాసయినట్టుగా అధిక మార్కులకు మార్చి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుండి 70 నుంచి 80 వేల రూపాయలు తీసుకుని నకిలీ సర్తిఫికెట్లు తయారుచేసి ఇచ్చేవారు. నకిలీ సర్టిఫికెట్ల సమాచారం సేకరించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు ఇన్ స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర ఆధ్వర్యంలో సంతోష్ నగర్ పోలీసులతో కలిసి దాడులు చేశారు.
ఈ ముగ్గురితో పాటు నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న సంతోష్ నగర్ కు చెందిన అబ్దుల్ రహీం, అబ్దుల్ కరీం, ఇస్మాయిల్ అహ్మద్, నసీర్ అహ్మద్, కామారెడ్డికి చెందిన ఫైసల్ బిన్ షాదుల్లా ను అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన ఎస్ఎస్ సీ, మహారాష్ట్ర ఇంటర్, ఉస్మానియా యూనివర్సిటి డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటి బీటెక్, తెలంగాణ యూనివర్సిటి డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లుతో పాటు సింబియాసిస్ ఇంటర్నేషనల్, డీమ్డ్ యూనివర్సిటీ పూణె కి చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
తాజావార్తలు
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..