Munugode Bypoll: మునుగోడులో విజయం ఆ పార్టీదే.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్..
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది.. ఈ నెల 6వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియగా.. అప్పటికే క్యూలైన్లలో చేరినవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.. పూర్తిస్థాయిలో పోలింగ్కు సంబంధించిన అధికార సమాచారం ఇంకా అందకపోయినా.. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు అంచనా వేస్తున్నారు.. అయితే, పోలింగ్ ముగిసిన వెంటనే కొన్ని సర్వే సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించారు.. అన్ని సర్వే ఫలితాల్లోనూ మునుగోడు గడ్డపై ఎగరబోయేది గులాబీ జెండేయని స్పష్టం అవుతోంది.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ తప్పదని తేల్చేశాయి సర్వేలు.. ఇక, అది మా సిట్టింగ్ స్థానం.. ఈ ఎన్నికల్లో విజయం మాదే అని కాంగ్రెస్ పోరాటం చేసినా.. ఓట్లు రాబట్టలేకపోయింది ఆ పార్టీ.. ఇదే సమయంలో ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. అన్ని వ్యూహాలతో తన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని విజయతీరాలను చేర్చిందని సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.
Read Also: Chandrababu and Lokesh: కుప్పం, మంగళగిరిలో అబ్బాకొడుకులు ఇద్దరూ ఓడిపోతారు..!
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
ఇక, ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తారని తేల్చేసింది.. అదే సమయంలో బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 23 శాతం ఓట్లు వస్తాయని.. బీసీ మంత్రంతో రంగంలోకి దిగిన బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.. ఇక త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లోనూ అధికార టీఆర్ఎస్కే పట్టం కట్టింది.. టీఆర్ఎస్కు ఏకంగా 47 శాతం ఓట్లు రానుండగా.. బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని తేల్చింది.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్ కే పట్టం కట్టాయి.. అయితే, జనరల్ ఎలక్షన్స్కు ముందు వస్తున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వ శక్తులు ఒడ్డాయి.. కాంగ్రెస్కు గుడ్బై చెప్పినా.. మళ్లీ గెలిచేది తానే అంటూ బీజేపీ నుంచి బరిలోకి దిగిన రాజగోపాల్రెడ్డికి పెద్ద షాక్ తప్పదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.. బై ఎలక్షన్స్ వస్తే విజయం మాదేనని చెప్పుకునే బీజేపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా చెబుతున్నాయి.. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. అసలైన ఫలితాల్లో రిపీట్ అవుతాయా? గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థియేనా? అనేది తెలుసుకోవడానికి మాత్రం.. ఈ నెల 6వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.
#MunugodeBypoll exit poll surveys predicting a thimphing victory for @trspartyonline
One has to wait till November 6 to see the voters mandate@NewIndianXpress pic.twitter.com/BsrCR5Xnid
— B Kartheek (@KartheekTnie) November 3, 2022
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?