Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేయండి.. ఎన్నికలు జరపండి
Gone Prakash Rao: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేసి.. జమిలి ఎన్నికలు జరపాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొనసాగుతున్న ప్రభుత్వాలను రద్దుచేయాలని కోరారు. 2024 ఏప్రిల్-మే నెలలో జరిగే సాధారణ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్రాలకు కూడా ఎన్నికల జరపాలని అన్నారు.మరో తొమ్మిది నెలలలో ఎన్నికలు జరుగుతుండగా.. అకస్మాత్తుగా జమిలి ఎన్నికల గురించి హడావిడి చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మన ప్రజాస్వామ్య ప్రక్రియలలో సంస్కరణల పట్ల నిజాయితీతో మీరు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారా? అని ప్రధాని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీ ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మరో డ్రామా ఆడే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి సందేహాలు దేశ ప్రజలందరికీ కలుగుతున్నాయని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం భారత్ అలాంటి దేశాన్ని ఒకే దేశం ఒకే పన్ను – ఒకే దేశం ఒకే రేషన్.. ఇప్పుడు ప్రస్తుతం ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మీ నిరంకుశ వ్యవస్థలో మాదిరిగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
Read also: Salaar : డబ్బింగ్ వర్క్ మొదలు పెట్టిన ప్రభాస్
Also Read
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
ఎన్నికల విషయం అట్లా ఉంచితే అంతకన్నా అత్యవసరమైన మన ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేయడం గురించి మీరు అసలు పట్టించుకోవడం లేదు అని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళుతున్న ఫిరాయింపుదారుల పట్ల లోక్సభ వివిధ రాష్ట్ర అసెంబ్లీల స్పీకర్లు రాజ్యసభ శాసనమండలి చైర్మన్ లకు కాలపరిమితి నిర్ణయించి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి ఎన్నికల నిర్వహణ ఖర్చు అని చెబుతున్న మీకు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందుకున్న భారతదేశం సుమారు 45 లక్షల కోట్ల వరకు ఉందని, ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు ఎన్నికల నిర్వహణ భారం అని పేర్కొనడం ప్రజాస్వామ్యం పట్ల మీ నిజాయితీని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా మీ ప్రభుత్వ పనితీరు చూసి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం కోల్పోవడంతో మీరు ఇటువంటి గ్రామాలు పాల్పడుతున్నారు అభిప్రాయం కలుగుతుందని విమర్శించారు. మీరు మన రాజకీయ వ్యవస్థను పటిష్ట పరచాలి అనుకుంటే ముందుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని కోరుతున్నట్లు ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ICC Rankings: కెరీర్ హై రేటింగ్కు చేరుకున్న భారత యువ ఆటగాళ్లు!
తాజావార్తలు
-
Elon Musk vs OpenAI Lawsuit: ప్రపంచ కుబేరుల మధ్య AI యుద్ధం.. ఎలోన్ మస్క్ వర్సెస్ సామ్ ఆల్ట్మాన్.. అసలేం జరుగుతోంది?
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో