Jupally krishna rao: కొల్లాపూర్ ఎమ్మెల్యే పై జూపల్లి తీవ్ర ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally krishna rao: కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లే ముందు జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బిఆర్ఎస్ ఉన్నాను లేనో పార్టీ అధినాయకత్వానికి తెలియాలి గత మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ బుక్లెట్లు కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరాచకాలపై మొరపెట్టుకుంటున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ కమిషన్లను ఆశ్రయించాలని నాకు సలహా ఇచ్చారని అన్నారు. సాధించిన తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు సాధించామా లేదా? అన్నది చూడల్సిన సమయం అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా జరగని దాడులు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు. ప్రగతి భవన్ ఆడమన్నట్టు ఆడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పోటీ చేస్తే పోలింగ్ ఏజెంట్ లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం తనకు బి ఫారాలు కూడా ఇవ్వలేదన్నారు. అయితే తన మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దిశలో రాష్ట్రం నడుస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు, నియామకాలు, నిధుల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. ఆ దిశగా ప్రభుత్వం నడుస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. గతంలో అచ్చంపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి తాను హాజరయ్యానని జూపల్లి కృష్ణారావు తెలిపారు. తన స్నేహితుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈరోజు కొత్తగూడెం వెళ్తున్నట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొంత కాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై జూపల్లి కృష్ణారావు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి కృష్ణారావు పార్టీ మారుతారనే ప్రచారం కూడా సాగుతుంది. ఈ తరుణంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు వెళ్లడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
గతేడాది కొల్లాపూర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్రెడ్డి వర్గీయుల మధ్య గ్యాప్ తగ్గుతుందని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్ రెడ్డిల మధ్య సవాళ్లు జరిగాయి. ఈ విషయంపై బహిరంగ చర్చకు సవాళ్లు చేశారు.
Sambasiva Reddy: సెంటు భూమి ఆక్రమించలేదు.. నిరూపిస్తే మీకే ఇచ్చేస్తా
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!