Errabelli Dayakar Rao: ఏం అభివృద్ధి చేశావని పాదయాత్ర చేస్తున్నావ్ బండి సంజయ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli Dayakar Rao Fires On Bandi Sanjay Over Padayatra: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏం అభివృద్ధి చేశావని పాదయాత్ర చేపట్టావంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. సోమవారం జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరేసిన తర్వాత మాట్లాడిన ఆయన.. అసలు ఏ ముఖం పెట్టుకొని జిల్లాకి వస్తున్నావంటూ బండి సంజయ్ను నిలదీశారు. ఏపీ విభజన చట్టం హామీల్లో భాగంగా వరంగల్కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయాల్లో కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని తెలిపిన ఎర్రబెల్లి.. అదే సమయంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల్ని కూడా ప్రజలని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్ ఏం చేశారనే దానిపై ప్రజలకు అర్థమయ్యేల్లా వాస్తవాల్ని వివరించాలని.. లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని బీజేపీ నెరవేర్చలేదన్నారు. కెసిఆర్ హయాంలో కర్నూలు జిల్లాలన్నీ సస్యశ్యామలంగా మారాయని.. వలసపోయిన రైతులు తిరిగి స్వగ్రామాలకొచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
గుజరాత్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఆ పార్టీ పెద్ద పీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలల కోసం నివేదికలు పంపిస్తే.. కేంద్రం మొండిచెయ్యి చూపించిందని ఎర్రబెల్లి అన్నారు. బీజేపీ ప్రతినిధులు ఉన్న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మెడికల్ కళాశాల తెచ్చుకోలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. గాంధీ లాంటి మహాత్ములు శాంతియుతంగా స్వాతంత్రం తీసుకొస్తే.. బిజెపి ఆ మహనీయుల పేరు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతోందని చెప్పారు. మతం పేరిట చిచ్చు రగిలిస్తూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనంతరం ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల్ని పరామర్శించిన ఎర్రబెల్లి.. బీజేపీ గుండాలే ఆ దాడికి పాల్పడ్డాడరని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు దేవరుప్పుల వద్ద ఉండగా, బీజేపీ వెంట 500 మంది గుండాలొచ్చారన్నారు. అక్కడ జెండా కార్యక్రమానికి వచ్చిన సతమ్మ అనే మహిళే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని, ఈ విషయంపై తాను డీజీపీకి కంప్లైట్ చేస్తానన్నారు. చివరగా.. ‘బండి సంజయ్, నీ పాదయాత్రం చేసుకుంటే సవ్యంగా చేసుకో.. ఏదో లబ్ది కోసం, సింపతి పొందడం కోసం గుండాలతో తిరిగితే ప్రజలే తిరగబడతారు’ అంటూ హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!