Graduate MLC Bypoll: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Graduate MLC Bypoll: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఉప ఎన్నిక కౌంటింగ్, ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల ఫలితాలు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎలిమినేషన్ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 220 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 139 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 118 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 76 ఓట్లు వచ్చాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోటా 1,55,095గా నిర్ణయించారు.
Read also: N. Uttam Kumar Reddy: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
మల్లన్న గెలవాలంటే 32,282 రెండో ప్రాధాన్యత ఓట్లు అవసరం కాగా, రాకేష్ రెడ్డి గెలవాలంటే 50,847 ఓట్లు కావాలి. ఈసారి 25,824 ఓట్లు చెల్లవని అధికారులు గుర్తించారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అసలు లెక్కలకు, నమోదైన లెక్కలకు పొంతన లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌంటింగ్ టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపుకు, ఆర్ఓ ప్రకటించిన ఓట్లకు మధ్య తేడాను సరిచేయాలని ఈసీని కోరింది. ఈ విషయమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి గురువారం రాత్రి బీఆర్కేఆర్ భవన్కు వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి లాభం చేకూర్చే విధంగా కౌంటింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Hyderabad: కూలీ పెంచండి.. నేడు హమాలీ కార్మికుల నిరసన..
తాజావార్తలు
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!