N. Uttam Kumar Reddy: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
N. Uttam Kumar Reddy: మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్లపై వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం తమ తదుపరి కార్యాచరణ వేగవంతం చేయనున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇవాళ, శనివారం అన్నారం, సుందిళ్ల డ్యామ్లను కూడా పరిశీలించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు క్షేత్రస్థాయిలో మరమ్మతులు, రక్షణ చర్యలను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా పురోగతిని సమీక్షిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో రెండు గేట్లను ఎత్తారు. 7వ బ్లాక్లో CSMRS గ్రూప్ పరీక్షలు జరుగుతున్నాయి.
Read also: Manamey Twitter Review : శర్వానంద్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడా..?
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల డ్యామ్ల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో ముఖ్యమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. ఏడో బ్లాక్లోని ఎనిమిది గేట్లలో ఇప్పటికే ఒక గేట్ ఎత్తివేయగా, కుంగిపోయిన పైర్ల మధ్యలో ఉన్న గేటును కోసి తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో గురువారం రెండింటిని తెరిచారు. 16, 17 గేట్లను ఎత్తివేసినట్లు ఇంజినీర్లు తెలిపారు. గతంలో మేడిగడ్డ 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయి అంతా సర్దుకుని గురువారం ఎత్తివేశారు. మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. వాటిని కూడా అదే విధంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
ఆనకట్ట వద్ద గ్రౌటింగ్తో సహా షీట్ ఫైల్స్, సీసీ బ్లాక్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు సీఎస్ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల వద్ద పనులన్నీ కొనసాగుతున్నాయి. విచారణ కమిషన్కు ప్రజల నుంచి 54 ఫిర్యాదులు అందాయి. వాటిని పూర్తిగా పరిశీలించి, ఆధారాలను పరిశీలించిన తర్వాత సమన్లు జారీ చేస్తారు. కమిషన్కు సహకరించేందుకు ఏర్పాటైన టెక్నికల్ కమిటీ కూడా ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. అక్కడి పరిస్థితులు, జరిగిన నష్టం, మరమ్మతు పనులు, రక్షణ చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. కమిటీ సభ్యులు తమ పరిశీలనలను జస్టిస్ పీసీ ఘోష్కు వివరిస్తారు.
Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!