N. Uttam Kumar Reddy: నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు మంత్రి ఉత్తమ్
N. Uttam Kumar Reddy: మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామ్లపై వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్.. రాష్ట్ర ప్రభుత్వం తమ తదుపరి కార్యాచరణ వేగవంతం చేయనున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇవాళ, శనివారం అన్నారం, సుందిళ్ల డ్యామ్లను కూడా పరిశీలించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు క్షేత్రస్థాయిలో మరమ్మతులు, రక్షణ చర్యలను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా పురోగతిని సమీక్షిస్తారు. మేడిగడ్డ బ్యారేజీలో మరో రెండు గేట్లను ఎత్తారు. 7వ బ్లాక్లో CSMRS గ్రూప్ పరీక్షలు జరుగుతున్నాయి.
Read also: Manamey Twitter Review : శర్వానంద్ ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేసాడా..?
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల డ్యామ్ల వద్ద మరమ్మతులు, రక్షణ చర్యలకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో ముఖ్యమైన గేట్ల ఎత్తివేత పనులు కొనసాగుతున్నాయి. ఏడో బ్లాక్లోని ఎనిమిది గేట్లలో ఇప్పటికే ఒక గేట్ ఎత్తివేయగా, కుంగిపోయిన పైర్ల మధ్యలో ఉన్న గేటును కోసి తొలగిస్తున్నారు. మిగిలిన ఆరు గేట్లలో గురువారం రెండింటిని తెరిచారు. 16, 17 గేట్లను ఎత్తివేసినట్లు ఇంజినీర్లు తెలిపారు. గతంలో మేడిగడ్డ 16వ గేటు తెరిచే సమయంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయి అంతా సర్దుకుని గురువారం ఎత్తివేశారు. మరో నాలుగు గేట్లను కూడా తెరవాల్సి ఉంది. వాటిని కూడా అదే విధంగా ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read also: Delhi: నకిలీ ఆధార్ తో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురు కూలీల అరెస్ట్
ఆనకట్ట వద్ద గ్రౌటింగ్తో సహా షీట్ ఫైల్స్, సీసీ బ్లాక్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు సీఎస్ఎంఆర్ఎస్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అన్నారం, సుందిళ్ల వద్ద పనులన్నీ కొనసాగుతున్నాయి. విచారణ కమిషన్కు ప్రజల నుంచి 54 ఫిర్యాదులు అందాయి. వాటిని పూర్తిగా పరిశీలించి, ఆధారాలను పరిశీలించిన తర్వాత సమన్లు జారీ చేస్తారు. కమిషన్కు సహకరించేందుకు ఏర్పాటైన టెక్నికల్ కమిటీ కూడా ఇప్పటికే మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించింది. అక్కడి పరిస్థితులు, జరిగిన నష్టం, మరమ్మతు పనులు, రక్షణ చర్యలు తదితర అంశాలను పరిశీలించారు. కమిటీ సభ్యులు తమ పరిశీలనలను జస్టిస్ పీసీ ఘోష్కు వివరిస్తారు.
Babar Azam Record: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్!
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!